బంజారాహిల్స్ : మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వాలంటూ దారిన పోతున్న వారిని బెదిరించడంతో పాటు మాట వినకపోతే బ్లేడ్తో గొంతు కోస్తానంటూ భయబ్రాంతులకు గురిచేస్తున్న నిందితుడిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్చేసి రిమాండ్కు తరలించారు.
బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ పూసపాటి శివచంద్ర తెలిపిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్ నెం 12లోని బోళానగర్లో నివాసం ఉంటున్న ఆఫ్రిదీ అహ్మద్ అలియాస్ అజర్ అనే యువకుడు గత కొంతకాలంగా మద్యానికి అలవాటు పడ్డాడు.
రాత్రిపూట రోడ్డుమీద నడుచుకుంటూ వెళ్లేవారిని లక్ష్యంగా చేసుకుని బెదిరింపులకు గురిచేయడం, వారివద్దనుంచి డబ్బులు లాక్కుని మద్యం తాగడం అలవాటు చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో ఆదివారం ముస్తఫా హష్మీ అనే వ్యాపారిని ఎన్బీటీనగర్ కల్లు కంపౌండ్ వద్ద అటకాయించిన ఆఫ్రిదీ బ్లేడ్తో గొంతు కోస్తానని బెదిరించి రూ.5వేలు లాక్కొన్నాడు.
మరుసటిరోజున బోళానగర్కు చెందిన ఎండీ జలాలుద్దీన్ అనే వ్యక్తిని అటకాయించిన అఫ్రిదీ అతడిజేబులోంచి రూ.3200 నగదు లాక్కున్నాడు. ఈ రెండు ఘటనలపై బాధితులు వేర్వేరుగా ఫిర్యాదులు చేయడంతో రెండు కేసులు నమోదు చేసిన పోలీసులు నిందితుడు అఫ్రిదీని శుక్రవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.