ముషీరాబాద్ : టీఎస్ఎస్పీడీసీఎల్ ఆజామాబాద్ డివిజన్ పరిధిలోని 11 కేవీ అహోబిలమఠం, బతుకమ్మకుంట, సాయిబాబా టెంపుల్ ఫీడర్ల పరిధిలో విద్యుత్ లైన్ల మరమ్మతుల కారణంగా మంగళవారం విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఏడీఈ విజయభాస్కర్ తెలిపారు.
అహోబిలమఠం ఫీడర్ పరిధిలో ఉదయం 10 గంటల నుంచి 12 వరకు ఏటీఐ, లైఫ్దవాఖాన, ఆంధ్రా బ్యాంక్, హోటల్ మేనేజ్మెంట్, సాయిబాబా టెంపుల్ పరిసర ప్రాంతాలు, బతుకమ్మకుంట ఫీడర్ పరిధిలో మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 వరకు పాములబస్తీ, మల్లన్న టెంపుల్, పోచమ్మబస్తీ, గంగానగర్ పరిసర ప్రాంతాలు విద్యుత్ సరఫరా నిలిపివేస్తారు.
సీఈ కాలనీ ఫీడర్ పరిధిలో మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 4.30 వరకు శివం రోడ్, శారదానగర్, సాయిబాబా నగర్ ఈ సేవా, బాగ్ అంబర్పేట్ పరిసర ప్రాంతాలు, సాయిబాబా టెంపుల్ ఫీడర్ పరిధిలో మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 4.30 వరకు ఆంధ్రా బ్యాంక్, వీహెచ్ హౌస్, సాయిబాబా టెంపుల్, ఓల్డ్ డీటీఆర్ పరిసర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు తెలిపారు.