మణికొండ : సదర్ సయ్యాటకు నగర శివారు ప్రాంతంలోని నార్సింగిలో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. గతేడాదితో పోల్చితే ఈసారి హర్యానా రాష్ట్రం నుంచి ఆల్ఇండియా చాంపియన్గా నిలిచిన ‘చాంద్వీర్’, అదేవిధంగా పాటియాల చాంపియన్ సోనిపట్ దున్నలు ప్రత్యేక ఆకర్శణగా నిలువనున్నాయి.
ఇప్పటికే నార్సింగికి చేరుకున్న ఆ దున్నలను అందంగా అలంకరించే పనిలో నిర్వహకులు నిమగ్నమయ్యారు. ఊరేగిం పు కోసం డీజేలతో పాటు బాణసంఛాలు, విద్యుదీపాలంకరణలతో ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు. యాదవులు అత్యం త ప్రతిష్టాత్మకంగా నిర్వహించే సదర్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు వాడవాడలా ప్లెక్సీలతో అలంకరించారు.
నార్సింగి మున్సిపాలిటీ వైస్ చైర్మన్ గొల్ల వెంకటేష్యాదవ్ నేతృత్వంలో ఈ ఉత్సవాలను ప్రతియేడు ఘనంగా నిర్వహిస్తారు. నార్సింగి ప్రధాన చౌరస్తా నుంచి వాడవాడలా ఊరేగింపులు నిర్వహించి యాదవుల ఐక్యతను చాటిచెప్తారు. గతేడాది కన్నా ఈసారి మరింత ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన వెల్లడించారు. రాష్ట్ర నలుమూలల నుంచి యాదవులు పెద్ద సంఖ్యలో హాజరై ఉత్సవాలను విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తిచేశారు.