పహాడీషరీఫ్ : ప్రజా సంక్షేమ పథకాలతో తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దిన టీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు.
జల్పల్లి కో -ఆప్షన్ మెంబర్ సూరెడ్డి కృష్ణారెడ్డి, కౌన్సిలర్లు కెంచె లక్ష్మీనారాయణ, పల్లపు శంకర్, మాజీ ఎంపీటీసీలు యంజాల జనార్థన్, దూడల శ్రీనివాస్ గౌడ్, సోషల్ మీడియా ఇన్చార్జి వాసుబాబు ఆధ్వర్యంలో మంగళవారం 20వ వార్డుకు చెందిన 100 మంది కార్యకర్తలు మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేస్తున్న అభివృద్ధిని చూసి టీఆర్ఎస్లోచేరారు.
మంత్రి వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బీసీ సెల్ అధ్యక్షుడు విస్కమూరి నిరంజన్ ఆధ్వర్యంలో ఇటీవల నూతనంగా ఏర్పాటు చేసిన వార్డుల బీసీ కమిటీ సభ్యులతో కలిసి మంత్రికి పుష్పగుచ్ఛం అందజేసి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. నూతన కమిటీ సభ్యులను అభినందించారు.
సబితా ఇంద్రారెడ్డి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్కు సంబంధించిన నూతన క్యాలండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ సారథ్యంలో జరిగే అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఎప్పటికప్పుడు ప్రజలకు వివరిస్తూ మరో వైపు పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు.