శేరిలింగంపల్లి : నానక్రాంగూడలోని గోల్ఫ్ ఎడ్జ్ రెసిడెన్స్ అపార్టుమెంట్స్ అసోసియేషన్ ఇష్టరాజ్యంగా వ్యవహారిస్తూ భవన నిర్మాణ నిభంధనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణ పనులకు పాల్పడుతున్నారని ప్రముఖ చలనచిత్ర నటుడు నరేష్ ఆరోపించారు. బుదవారం నానక్రాంగూడలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నానక్రాం గూడలో గోల్ప్ఎడ్జ్ రెసిడెన్షియల్ కాంప్లెక్సును గతంలో తాము డెవలఫ్మెంట్కు అగ్రిమెంట్ ఇవ్వడం జరిగిందన్నారు. 33 అంతస్థుల రెసిడెన్షియల్ బహుళ అంతస్థుల భవనంలో 487 ప్లాట్లు అందుబాటులో ఉన్నాయని అన్నారు. ప్లాట్లు కొన్ని డుప్లెక్సులు, మరికొన్ని టిఫ్లెక్సులు ఉన్నాయన్నారు.
కాగా ఇటీవల కరోనా సమయంలో సదరు గోల్ప్ఎడ్జ్ రెసిడెన్స్ అసోసియేషన్ చెందిన అధ్యక్షుడు ప్రీతి శుక్లా, ప్రదాన కార్యదర్శి మాధవ్, సభ్యుడు సంజీవ్లు తమ ఇష్టరాజ్యంగా వ్యహహరిస్తూ రెండు ప్లాట్లలో నిబంధనలకు విరుధ్దంగా డివియేషన్ చేపట్టి నిర్మాణాలు చేశారంటూ ఆగ్రహాం వ్యక్తం చేశారు. దీంతో పలు ప్లాట్లు పాక్షికంగా దెబ్బతిన్నాయని, కాన్ఫరెన్స్ హాలు సీలింగ్ పెచ్చులూడాయని తెలిపారు. దీనికి కారణమైన సదరు అపార్టుమెంట్ అసోసియేషన్ సభ్యులపై తగిన చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ విషయమై జీహెచ్ఎంసీ చీఫ్ సీటీ ప్లానర్ దెవేందర్ రెడ్డికి ఫిర్యాదు చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఈ మీడియా సమావేశంలో గోల్ప్ ఎడ్జ్ రెసిడెన్స్ మాజీ అధ్యక్షుడు అనుపమ్ అగర్వాల్, రిటైడ్ వింగ్ కమాండర్ జగన్ మోహాన్, వీఆర్ఆర్ చారి తదితరులు పాల్గొన్నారు.