రంగారెడ్డి జిల్లా కోర్టులు : పెళ్లి చేసుకుంటానని నమ్మంచి మైనర్ను గర్బవతి చేసిన నిందితుడు మాల అంజయ్యకు 20 సంవత్సరాల జైలు శిక్ష, 10 వేల జరిమానా విధిస్తూ రంగారెడ్డి జిల్లా పోక్సో ప్రత్యేక న్యాయస్థానం తీర్పునిచ్చింది.
అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ సి.రాము కథనం ప్రకారం.. చేవెళ్ళలోని సీపీఐ కాలనీలో ఓ వివాహిత తన మైనర్ కూతురుతో కలసి నివసిస్తూ, చిన్ని చిన్న పనులు చేసుకుంటూ ఉండేవారు. అదే ప్రాంతంలో నివసించే మాల అంజయ్య (26) ఎవరు లేని సమయంలో బలవంతంగా మైనర్ బాలికను తన ఇంట్లోకి తీసుకువెళ్ళి లైంగికదాడికి పాల్పడ్డాడు.
ఈ విషయం ఎవరికి చెప్పవద్దని పెళ్ళి చేసుకుంటానని అమ్మాయిని మభ్యపెట్టారు. ఒక రోజు తన కూతురును గమనించిన తల్లి ప్రశ్నించిగా జరిగిన తతంగాన్ని వివరించింది. దీంతో ఆమె చేవెళ్ళ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.
ఆ తర్వాత రిమాండ్కు తరలించి కోర్టులో అభియోగపత్రాన్ని దాఖలు చేశారు. సాక్షాధారాలను పరిశీలించిన న్యాయస్థానం నిందితునికి 20 సంవత్సరాల జైలు శిక్ష, 10 వేల జరిమానా విదిస్తూ తీర్పునిచ్చింది.