గోల్నాక : నియోజకవర్గ వ్యాప్తంగా జరుగుతున్న పలు అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ సూచించారు. గురువారం గోల్నాకలోని క్యాంపు కార్యాలయంలో జీహెచ్ఎంసీ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గంలోఉన్న ఐదు డివిజన్లలోనూ పలు ప్రాంతాల్లో ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని ఆయన అడిగి తెలుసుకున్నారు.
పెండింగ్లో ఉన్న పనులు వెంటనే పూర్తి చేయాలని ఆయన అధికారులకు సూచించారు. దీంతో పాటు కొత్తగా ఏఏ ప్రాంతాల్లో రహదారులు ఏర్పాటు చేయాలో వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆయన సూచించారు. అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో జీహెచ్ఎంసీ ఈఈ శంకర్, డీఈ సుధాకర్, సంతోష్, ఏఈ ప్రేరణ, ఫరీద్, శ్వేత, వర్క్ ఇన్స్పెక్టర్లు మనోహర్, నరేందర్, రవి తదితరులు పాల్గొన్నారు.