గోల్నాక : తన దృష్టికి వచ్చిన స్థానిక సమస్యలు ఎప్పటికప్పడు పరిష్కరిస్తున్నట్లు ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు. బుధవారం గోల్నాకలోని క్యాంపు కార్యాలయంలో అంబర్పేట డివిజన్ పటేల్నగర్ బస్తీ వాసులు స్థానిక కార్పొరేటర్ ఇ.విజయ్కుమార్గౌడ్ నేతృత్వంలో ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ను కలసి తమ సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రం అందజేశారు.
ముఖ్యంగా బస్తీలోని దుర్గామాతా ఆలయంలో భక్తులు నిత్యం పూజలు నిర్వహిస్తుంటారని, అయితే ఇటీవల ఆలయం లోకి వెళ్లే దారిలో జీహెచ్ఎంసీ అడ్డంగా మెట్లు నిర్మించడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురువుతున్నారని బస్తీ వాసులు వివరించారు.
అలాగే అజాద్నగర్ డ్రైనేజీ పైప్లైన్ల ఏర్పాటు పనులు పూర్తి అయిన వెంటనే సరోజినీ బస్తీలో కూడా డ్రైనేజీ పైప్లైన్ పనులు చేపట్టాలని బస్తీ వాసులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా.. వెంటనే సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే సంబంధిత అధికారులతో మాట్లాడి వీలైనంత త్వరగా సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
స్థానికంగా ఎలాంటి సమస్య తలెత్తినా తన దృష్టికి తీసుకురావాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే బస్తీ వాసులకు సూచించారు. ఎమ్మెల్యేకు వినతి పత్రం ఇచ్చిన వారిలో పటేల్నగర్ బస్తీ వాసులు గట్టయ్య, యాదగిరి, విజయ్కుమార్, సంజీవయ్య, జక్కయ్య, వేణు, రాజీవ్, రాజేష్, అహ్మద్ తదితరులు ఉన్నారు.