షేక్పేట్ : జూబ్లీహిల్స్ నియోజకవర్గం షేక్పేట్ డివిజన్ షేక్ పేట్ నాలా వద్ద గురువారం ఉదయం జాబ్లీహిల్స్ నియోజకవర్గం ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ ప్రభుత్వ పథకాలతో రూపొందించిన భారీ గాలిపటాన్ని క్రేన్ సహాయంలో ఎగురవేశారు.
ఈ గాలిపటంపై ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణలో అమలు చేస్తున్న రైతుబంధు తదితర పథకాల గురించి ముద్రించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆందరకీ ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఢివిజన్ అధ్యక్షులు దుర్గం ప్రదీప్కుమార్, నాయకులు షకీల్ అహ్మద్, బాలకృష్ణ, మధుసూదన్, సజ్జాద్ తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు డివిజన్లోని టీఆర్ఎస్ పార్టీ నాయకులకు ,కార్యకర్తలకు ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ గాలిపటాలను అందచేశారు.