మిడ్జిల్, జనవరి 5 : రైతు సంక్షేమానికి ప్రభు త్వం పెద్దపీట వేసి పథకాలను అమలు చేస్తున్నద ని మార్కెట్ కమిటీ చైర్మన్ శ్యాంసుందర్రెడ్డి అన్నా రు. బుధవారం మండలకేంద్రంతోపాటు వాడ్యా ల్, రాణిపేట, కొత్తూర్, దోనూర్ గ్రామాల్లో రైతుబంధు వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ పొలాల్లో కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. అనంతరం రైతువేదికల వద్ద మొక్కలు నాటారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ శశిరేఖ, ఎంపీపీ కాంతమ్మ, ఎంపీటీసీ రాజిరెడ్డి, స ర్పంచులు జంగారెడ్డి, నారాయణరెడ్డి, నిరంజన్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పాండు, దానియే లు, బాలు, ఎల్లయ్యయాదవ్, కాడయ్య, ప్రతాప్రెడ్డి, జైపాల్రెడ్డి, శ్రీనివాసులు పాల్గొన్నారు.
‘రైతుబంధు’ దేశానికే ఆదర్శం
కోయిలకొండ, జనవరి 5 : రైతుబంధు పథకం దేశానికే ఆదర్శమని జెడ్పీటీసీ విజయభాస్కర్రెడ్డి అన్నారు. మండలంలోని గార్లపాడ్, చంద్రాస్పల్లి, శేరివెంకటాపూర్, కొత్లాబాద్, సూరారం గ్రామా ల్లో నిర్వహించిన రైతుబంధు వారోత్సవాల్లో పా ల్గొని మాట్లాడారు. రైతుల అభ్యున్నతికి ప్రభు త్వం అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం వ్యాసరచన, ఉపన్యాస పోటీల్లో ప్రతిభకనబర్చిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. అదేవిధంగా కొత్లాబాద్ గ్రామంలో రైతులు ముఖ్యమం త్రి కేసీఆర్, ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమాల్లో సర్పంచులు కరుణాకర్రెడ్డి, చరితాదయాకర్రెడ్డి, రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు శ్రీనివాస్రెడ్డి, మం డల కన్వీనర్ మల్లయ్య, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బీ.కృష్ణయ్య, రాజేంద్రప్రసాద్గౌడ్, వైస్ఎం పీపీ కృష్ణయ్యయాదవ్, ఎంపీటీసీలు సత్యంగౌడ్, మణెమ్మ, నాయకులు భీంరెడ్డి, మాధవారెడ్డి, రా జవర్ధన్రెడ్డి, రాజిరెడ్డి, మాధవులు పాల్గొన్నారు.
చిన్నచింతకుంట మండలంలో..
దేవరకద్ర రూరల్, జనవరి 5 : చిన్నచింతకుంట, లాల్కోట ఉన్నత పాఠశాలల్లో విద్యార్థుల కు రైతుబంధు పథకంపై వ్యాసరచన, చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. చిన్నచింతకుంటలో జె డ్పీ చైర్పర్సన్ స్వర్ణసుధాకర్రెడ్డి, ఎంపీపీ హర్షవర్ధన్రెడ్డి, సర్పంచ్ మోహన్గౌడ్, ఎంపీటీసీ ఉషారాణి, రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు కరుణాకర్రెడ్డి, మండల అధ్యక్షుడు మన్యంగౌడ్, కురుమూర్తి ఆలయ కమిటీ చైర్మన్ ప్రతాప్రెడ్డి పోటీల ను పరిశీలించారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ పద్మాభాస్కర్, రైతుబంధు కోఆర్డినేటర్ దశరథ్, శివకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
జడ్చర్ల మండలంలో..
జడ్చర్ల రూరల్, జనవరి 5 : రైతుబంధు వారోత్సవాల్లో భాగంగా మండలంలోని పోలేపల్లిలో అంగన్వాడీ చిన్నారులకు వెల్బేబీషో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతిభకనబర్చిన చిన్నారులకు జెడ్పీ వైస్చైర్మన్ యాదయ్య బహుమతులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ చేతనారెడ్డి, పీఏసీసీఎస్ చైర్మన్ సుధాకర్రెడ్డి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు జంగయ్య, టీఆర్ఎస్ అధ్యక్షుడు రఘుపతిరెడ్డి, గ్రామాధ్యక్షుడు అశోక్గౌడ్, ఏఈవో శారద, సూపర్వైజర్ పద్మ, వెంకటేశ్, వీరేశ్, పాండు, మాసయ్య పాల్గొన్నారు.
భూత్పూర్ మండలంలో..
భూత్పూర్, జనవరి 5 : భూత్పూర్, అన్నాసాగర్, పోతులమడుగు ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులకు రైతుబంధుపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో ఏవో మురళీధర్, జీహెచ్ఎం సంగీత, ఏఈవోలు హర్షవర్ధన్, సురేశ్కుమార్, రైతుబంధు కోఆర్డినేటర్లు తిరుపతయ్యగౌడ్, వీరాంజనేయులు, రాజారెడ్డి, టీఆర్ఎస్ ప ట్టణ అధ్యక్షుడు సురేశ్గౌడ్, రాకేశ్ పాల్గొన్నారు.
నవాబ్పేట మండలంలో..
నవాబ్పేట, జనవరి 5 : మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు వ్యవసా య శాఖ ఆధ్వర్యంలో రైతుబంధు పథకంపై వ్యా సరచన పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో సింగిల్విండో చైర్మన్ మా డెమోని నర్సింహులు, రైతుబంధు సమితి మం డల అధ్యక్షుడు మధుసూదన్రెడ్డి, సర్పంచ్ గోపాల్గౌడ్, ఏవో కృష్ణకిశోర్, కోఆప్షన్ సభ్యుడు తా హెర్, మార్కెట్ కమిటీ వైస్చైర్మన్ గండు చెన్న య్య, జీహెచ్ఎం రెహానాబేగం, సింగిల్విండో డైరెక్టర్ కరణం ప్రతాప్, ఏఈవో శ్వేత, మెండె లక్ష్మ య్య, అంజయ్య, శ్రీశైలం పాల్గొన్నారు.