ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి
171 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
నల్లగొండ, జనవరి 30 : సీఎం సహాయ నిధితో పేదలకు మెరుగైన వైద్యం అందుతుందని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి అన్నారు. ఆది వారం తన క్యాంప్ కార్యాలయంలో వివిధ మండలాలకు చెందిన 171 మంది లబ్ధిదారులకు రూ.66.08 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆయా కుటుంబాలకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తాను ఎన్నికైన దగ్గర నుంచి ఇప్పటి వరకు ముఖ్యమంత్రి పరిశీలనకు ఐదు వేల దరఖాస్తులు పంపించగా అందులో 3,800 దరఖాస్తులకు సంబంధించి రూ.17 కోట్ల సాయం మంజూరైందన్నారు. సాయం పొందిన జిల్లాల్లో నల్లగొండలోనే ఎక్కువగా ఉన్నట్లు తెలిపారు. పార్టీలకు అతీతంగా సీఎంఆర్ఎఫ్ సహాయం అందజేస్తున్నట్లు తెలిపారు. నల్లగొండ ప్రభుత్వ దవాఖానలో కార్పొరేట్ స్థాయి సేవలు అందిస్తున్నందున ప్రైవేటు దవాఖానకు వెళ్లకుండా ప్రభుత్వ ఆస్పత్రిలోనే చికిత్స చేయించుకోవాలని ఆయన సూచించారు. నల్లగొండ ప్రభుత్వ దవాఖానకు అదనంగా ఐదు డయాలసిస్ మిషన్లు, పార్ధీవ వాహనం మంజూరు చేసినందుకు మంత్రి జగదీశ్రెడ్డికి కృతజ్ఞతలు తెలియ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ బొర్ర సుధాకర్, కనగల్ ఎంపీపీ కరీం పాషా, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు పిల్లి రామరాజు, సింగం రామ్మోహన్, టీఆర్ఎస్ తిప్పర్తి, నల్లగొండ, కనగల్ మండలాధ్యక్షులు పల్ రెడ్డి రవీందర్రెడ్డి, దేప వెంకట్రెడ్డి, ఐతగోని యాద య్య, సింగిల్ విండో చైర్మన్ వంగాల సహదేవరెడ్డి, పిన్నపురెడ్డి మధుసూదన్రెడ్డి, వనపర్తి జ్యోతి, సంకుధనలక్ష్మి, వెంకట్రెడ్డి, శేఖర్రెడ్డి, నాగేశ్వర్రావు, కృష్ణార్జున్రెడ్డి పాల్గొన్నారు.