ఎమ్మెల్యే నోముల భగత్
హాలియా, జనవరి 30 : మహాత్మాగాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్య స్థాపనకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తున్నదని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. ఆదివారం మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా హాలియా సెంటర్లోని మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా చేయడంతో పాటు వాటికి అధిక నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తున్నదన్నారు. వాసవీక్లబ్, ఆర్యవైశ్య సంఘం నాయకులు కూడా గాంధీజీ విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం ఆస్పత్రుల్లో రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ వెంపటి పార్వతమ్మాశంకరయ్య, టీఆర్ఎస్ నాయకులు మల్గిరెడ్డి లింగారెడ్డి, నల్లగొండ సుధాకర్, జిల్లా రైస్మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు చిట్టిపోలు యాదగిరి, వాసవీక్లబ్ అధ్యక్షుడు కొండూరు శోభన్బాబు, బచ్చు వెంకన్న, ఆర్యవైశ్య సంఘం నాయకులు చీదళ్ల లింగయ్య, తేలపోలు శేఖర్, వెంపటి శ్రీను, పాంపాటి శ్రీను పాల్గొన్నారు.
గాంధీ వర్ధంతి
మాల్ : చింతపల్లి మండల కేంద్రంతో పాటు కుర్మేడు, మాల్, రోటిగడ్డతండాల్లో గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ముచ్చర్ల యాదగిరి, వూరె లక్ష్మణ్, రోటిగడ్డ తండా సర్పంచ్ ఇస్లావత్ పద్మా పుల్సింగ్ నాయక్, నేనావత్ రాంజీ, ఇస్లావత్ గోపీనాయక్ పాల్గొన్నారు.
మహాత్ముడికి ఘన నివాళి
దేవరకొండ : వాసవీ, వనితక్లబ్ ఆధ్వర్యంలో పట్టణంలోని గాంధీబజార్లో ఉన్న మహాత్మాగాంధీ విగ్రహానికి మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నర్సింహ పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు వాస వెంకటేశ్వర్లు, రమేశ్, సుకన్య, మల్లయ్య, మాధవి, దివ్య మంజూల, జంగయ్య, సుబ్బారావు, నీల రవికుమార్, లక్ష్మణ్, బుచ్చయ్య పాల్గొన్నారు.
మాస్కులు, శానిటైజర్ల పంపిణీ
చిట్యాల : వాసవీక్లబ్ చిట్యాల లెజెండ్, ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో చిట్యాలలో గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పెద్దకాపర్తిలోని గాంధీ గుడి వద్ద పూజలు చేశారు. మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షుడు వనమా వెంకటేశ్వర్లు, చిట్యాల పట్టణాధ్యక్షుడు వాస విద్యాసాగర్, వాసవీ క్లబ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ప్రొద్దటూరు శ్రీనివాసులుగుప్త, మేడిశెట్టి ఉమాశంకర్, కోశాధికారి ఇమ్మడి వెంకటేశ్వర్లు, బుస్సా శ్రీనివాస్, బూరుగు కృష్ణయ్య, వేలుపల్లి వెంకటేశ్వర్లు, రంగా వెంకటేశ్వర్లు, శీలా సత్యనారాయణ, జగిని వెంకన్న, జయారపు శివ, పొల నవీన్, వనమా సాంబమూర్తి, మేడిశెట్టి శ్రీనివాసు, కలకుంట్ల రవి, సకినాల సుధీర్, ఆకారపు శివ పాల్గొన్నారు.