బొడ్డుగూడెం రైతు ఆరోపణ
ట్రాన్స్కో కార్యాలయం ఎదుట ఆందోళన
లైన్మన్పై చర్యలు తీసుకోవాలని వినతి
చౌటుప్పల్, నవంబర్ 29 : లంచం ఇవ్వడానికి నిరాకరించిన తనపై గొడవపడి ట్రాన్స్కో లైన్మన్ చేయి చేసుకున్నాడని మోత్కూరు ట్రాన్స్కో విద్యుత్ కార్యాలయం ఎదుట సోమవారం ఓ రైతు ఆందోళనకు దిగాడు. లైన్మన్పై చర్యలు తీసుకొని తనకు న్యాయం చేయాలని ఏఈకి వినతి పత్రం అందజేశాడు. అడ్డగూడూరు మండలంబొడ్డుగూడేనికి చెందిన బాధిత రైతు ఎలుక మల్లయ్య తెలిపిన వివరాల ప్రకారం.. ‘గ్రామంలో నాతోపాటు మరో ముగ్గురం రైతులం కొత్త ట్రాన్స్ఫార్మర్ కోసం రూ.6వేల చొప్పున డీడీలు తీసి గతేడాది నవంబర్లో ఇచ్చాం. కొత్త ట్రాన్స్ఫార్మర్ పాత ట్రాన్స్ఫార్మర్నే బిగించడంతో పదే పదే ట్రిప్ అయ్యి తీవ్ర ఇబ్బందులకు గురయ్యాం. విద్యుత్ స్తంభాలకు అమర్చలేదు. కొత్త సర్వీస్ కనెక్షన్ నంబర్ కూడా ఇవ్వక తిప్పుకుంటున్నాడు. పైగా కరెంట్ బిల్లు పేరిట రూ.2వేలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. నిరాకరించడంతో లైన్మన్ వెంకన్న సోమవారం నాపై దౌర్జన్యానికి దిగాడు. వద్దకు వచ్చి ట్రాన్స్ఫార్మర్ ఫీజులను తీసుకొని వెళ్తుండగా బతిమిలాడినా వినలేదు. యాసంగి వరి సాగుకు అలుకుడు ఉందని, కాళ్ల వేళ్ల పడ్డా కనికరించలేదు. పైగా చేయి అని మీడియా ఎదుట రైతు మల్లయ్య గోడు వెళ్లబోసుకున్నాడు. ఈ విషయంపై మోత్కూరు ట్రాన్స్కో ఏఈ హుస్సేన్కు కూడా ఫిర్యాదు చేశాడు. తన విద్యుత్ కనెక్షన్పై రూ.230 బిల్లు ఉంటే.. రూ.2వేలు లంచం అడిగాడని వాపోయాడు.ప్రశ్నించిన అకారణంగా కొట్టిన లైన్మన్, అతని అసిస్టెంట్పై చర్యలు తీసుకొని తన బోరు మోటర్కు కనెక్షన్ను పునరుద్ధరించాలని రైతు మల్లయ్య కోరాడు.
లంచం అడగలేదు;వెంకన్న, లైన్మన్
ఈ విషయమై లైన్మన్ను వివరణ కోరగా, టాన్స్ఫార్మర్ కోసం డీడీలు కడితే కొత్త ట్రాన్స్ఫార్మర్ అందుబాటులో లేకపోవడంతో పాతది బిగించామన్నారు. సర్వీస్ కనెక్షన్ బిల్లు చెల్లించమని అడిగానే తప్ప తాను లంచం ఇవ్వమనలేదని పేర్కొన్నాడు.