జిల్లా వ్యాప్తంగా సీఎం కేసీఆర్ ఫ్లెక్సీలకు క్షీరాభిషేకం
దవాఖానలో రోగులకు పండ్లు పంపిణీ
యాదాద్రి, నవంబర్ 29 : ‘రాష్ట్రం వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో’ నినాదంతో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేపట్టిన దీక్షతోనే 60 ఏళ్ల తెలంగాణ ప్రజల అకాంక్ష నెరవేరిందని, ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించడంతో పాటు సబ్బండ వర్గాల సంక్షేమానికి ఆయన పాటుపడుతున్నారని డీసీసీబీ చైర్మన్, టెస్కాబ్ వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి అన్నారు. దీక్షా దీవస్ సందర్భంగా సోమవారం యాదగిరిగుట్ట పట్టణంలోని సీఎం కేసీఆర్ చిత్రపటానికి ఆయన క్షీరాభిషేకం చేశారు. నవంబర్ 29 దీక్షా దీవస్ స్ఫూర్తిని, జ్ఞాపకాలను, పోరాటాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ప్రాణాలను పణంగా పెట్టి ఆమరణ దీక్ష చేపట్టి రాష్ర్టాన్ని సాధించిన ఉద్యమ నేత కేసీఆర్ చరిత్రలో నిలిచిపోయారన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డమీది రవీందర్గౌడ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కర్రె వెంకటయ్య, పట్టణాధ్యక్షుడు పెలిమెల్లి శ్రీధర్గౌడ్, పట్టణ సెక్రటరీ జనరల్ అంకం నర్సింహ, మండల సెక్రటరీ జనరల్ కసావు శ్రీనివాస్, రైతుబంధు సమితి జిల్లా డైరక్టర్ మిట్ట వెంకటయ్య, నాయకులు ఎరుకల హేమేందర్గౌడ్, పాపట్ల నరహరి, బండి వాసు పాల్గొన్నారు.
టీఆర్ఎస్ జెండావిష్కరణ
బొమ్మలరామారం : మండలంలోని సోలీపేట గ్రామంలో దీక్షా దివస్ సందర్భంగా టీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి గోలిపల్లి పోషంరెడ్డి, సర్పంచ్ నవీన్ గౌడ్, నాయకులు ఆంజనేయులు గౌడ్, సురెడ్డి సత్తిరెడ్డి, మెలుగు శ్రీనివాస్, రమేశ్ గౌడ్ పాల్గొన్నారు.
తుర్కపల్లిలో..
తుర్కపల్లి : మండల కేంద్రంలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. అంతకు ముందు తెలంగాణతల్లి విగ్రహనికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎంపీపీ బూక్యా సుశీలారవీందర్, టీఆర్ఎస్ మండల సెక్రటరీ జనరల్ శాగర్ల పరమేశ్, వైస్ఎంపీపీ మహదేవుని శ్రీనివాస్, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు పోగుల ఆంజనేయులు, పార్టీ జిల్లా నాయకుడు సుంకరి శట్టయ్య, అధికార ప్రతినిధి, తలారి శ్రీనివాస్, టీఆర్ఎస్వీ, యువజన విభాగం మండలాధ్యక్షుడు భరత్గౌడ్, జాలిగాం కృష్ణ, సర్పంచులు శ్రీనివాస్రెడ్డి, మల్లప్ప, సురేశ్, మహేందర్, సోషల్మీడియా నియోజకవర్గ కన్వీనర్ నల్లశ్రీకాంత్, పీఏసీఎస్ డైరెక్టర్ నరసింహ, నాయకులు వెంకట్రెడ్డి, పాండు, నర్సింహ, మోతీరాం, సర్వర్పాషా పాల్గొన్నారు.
ఆలేరు టౌన్ : దీక్షా దివస్ను పురస్కరించుకొని ఆలేరు పట్టణంలో సోమవారం టీఆర్ఎస్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య, పార్టీ పట్టణాధ్యక్షుడు పుట్ట మల్లేశం, మొరిగాడి వెంకటేశ్, రాయపురం నర్సింహులు, పాశికంటి శ్రీనివాస్, సరాబు సంతోశ్, చింతకింది మురళి, కూళ్ల వెంకటేశ్, సీస సత్తయ్య, ఆలేటి అనిల్, చిమ్మి శివమల్లు, కొనపురం నాగరాజు, టింకు, ఫయాజ్, బాలరాజు పాల్గొన్నారు.
కేసీఆర్ దీక్షతోనే రాష్ట్రం సాకారం
రామన్నపేట : కేసీఆర్ ఆమరణ దీక్ష చేయడం వల్లే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటైందని టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మందడి ఉదయ్రెడ్డి, ఎంపీపీ కన్నెబోయిన జ్యోతీబలరాం అన్నారు. సోమవారం మండలకేంద్రంలోని సుభాశ్సెంటర్లో సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. అనంతరం రామన్నపేటలోని ప్రభుత్వ దవాఖానలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ నంద్యాల భిక్షంరెడ్డి, టీఆర్ఎస్ మండలప్రధానకార్యదర్శి పోచబోయిన మల్లేశం, నాయకులు అంతటి రమేశ్, బందెల రాములు, నీల దయాకర్, కంభంపాటి శ్రీనివాస్, గుత్తా నర్సిరెడ్డి, పోతరాజు సాయికుమార్, గొరిగే నర్సింహ, దోమల సతీశ్, ఆమేర్, బొక్క మాధవరెడ్డి, బత్తుల వెంకటేశం, రేఖాయాదయ్య, కోళ్లస్వామి, ఉప్పు ప్రకాశ్, పున్న వెంకటేశం, మిర్జా ఇనాయతుల్లా, కడమంచి స్వామి, పొలగోని నర్సింహ, బొడ్డు అల్లయ్య, నాయకులు పాల్గొన్నారు.