పాల్గొన్న ఎమ్మెల్యే జైపాల్యాదవ్, ప్రజాప్రతినిధులు
కడ్తాల్, నవంబర్ 29 : మండల కేంద్రంలోని ఏంబీఏ గార్డెన్స్లో సోమవారం అయ్యప్పస్వామి మహాపడి పూజ ఘనంగా నిర్వహించారు. గురుస్వామి చందర్నాయర్ ఆధ్వర్యంలో 18వ మెట్టు గురుస్వామి గొర్ల వేణుగోపాల్ ఆధ్వర్యంలో నిర్వహించిన అయ్యప్పస్వామి మహాపడి పూజ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే జైపాల్యాదవ్, సర్పంచ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనర్సింహారెడ్డి, కృష్ణయ్యయాదవ్ పాల్గొన్నారు. గణపతి, కుమారస్వాములతోపాటు, నవగ్రహా హోమాలు, అభిషేకం, సహస్రనామార్చనలు నిర్వహించారు. అనంతరం అయ్యప్పస్వామికి పూలు, చందనం, పన్నీరు, నెయ్యి, తులసీ దళాలతో అభిషేకం, పడిపూజ కార్యక్రమలు చేపట్టారు. ప్రజాప్రతినిధులు అయ్యప్పస్వాములు, భక్తులతో కలిసి బిక్ష కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో నాయకులు సుదర్శన్రెడ్డి, నర్సింహగౌడ్, రాజేందర్యాదవ్, మహేశ్, భిక్షపతియాదవ్, రాములునాయక్, స్వాములు భీముడు, మోత్యానాయక్, సైదులు, చంద్రశేఖర్, శేఖర్గౌడ్, శ్రీకాంత్రెడి పాల్గొన్నారు.
అయ్యయ్య స్వాములకు అన్నదానం
కొత్తూరు, నవంబర్ 29 : కొత్తూరు మున్సిపల్ చైర్పర్సన్ లావణ్యదేవేందర్ ఆధ్వర్యంలో సోమవారం అయ్యప్పస్వాములకు అన్నదానం చేశారు. బాతుక లావణ్య దేవేందర్యాదవ్, విజయలక్ష్మి లక్ష్మయ్య ఇంట్లో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం సతీశ్నాయర్గురుస్వామిని సన్మానించారు. కార్యక్రమంలో గురుస్వాములు హరిజీవన్, నారాయణ, టీఆర్ఎస్ కొత్తూరు మండల ఇన్చార్జి యాదగిరి, రాఘవేందర్యాదవ్ పాల్గొన్నారు.