కేంద్రం యాసంగి పంట కొనేవరకు వదిలేదు లేదు
ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి
కొడంగల్, నవంబర్ 29 : అరవై ఏండ్ల పాలనలో రైతు సంక్షేమానికి పాటుపడని కాంగ్రెస్ ఇప్పుడు రేవంత్రెడ్డి రాజకీయ మనుగడ కోసం బూటకపు, దొంగ రైతు దీక్షలు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి ఆరోపించారు. సోమవారం హస్నాబాద్, పర్సాపూర్ గ్రామాల్లో ధా న్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించ డంతో పాటు లబ్ధిదారుల ఇండ్లకు వెళ్లి సీ ఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే అందిం చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లా డుతూ రేవంత్రెడ్డి రైతుల పట్ల సవతి ప్రే మను నటిస్తూ మోసం చేసేందుకు ఎత్తుగడ వేస్తున్నట్లు ఆరోపించారు. ఆరుగాలం కష్ట పడి పండించిన ప్రతి గింజను కొనుగోలు చేసేవిధంగా ముఖ్యమంత్రి ప్రత్యేకంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేసి గిట్టు బాటు ధరలతో ధాన్యం కొనుగోళ్లు చేపడు తున్నట్లు తెలిపారు. వర్షా కాలంలో పండిన వరి పంటను కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉండగా, యాసంగి పంటను కొనుగోలు చేసేందుకు కేంద్రం వెనుకాడుతున్నట్లు తెలిపారు. రైతులు ఎటువంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని, యాసంగిలో రైతులు పండించిన ప్రతి గింజను కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేసే వరకు వదిలేది లేదన్నారు. రైతుల కోసం హైదరాబాద్లో ధర్నా చేసిన సీఎం ఢిల్లీలో మహాధర్నా చేపట్టేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. వచ్చే మార్చి బడ్జెట్లో నియోజకవర్గంలోని ప్రతి తండాకు బీటీ రోడ్డు మంజూరు చేసే విధం గా కృషి చేయనున్నట్లు హామీ ఇచ్చారు. పర్సాపూర్ గ్రామంలోని రాళ్ల పేట చెరువు మరమ్మతుకు ప్రస్తుతం రూ.10లక్షల నిధు లు మంజూరు చేసే విధంగా కృషి చేస్తానని, వచ్చే సంవత్సరం బడ్జెట్లో పూర్తి స్థాయి లో మరమ్మతులు చేపట్టే విధంగా చర్యలు తీసుకొంటానని తెలిపారు. నియోజకవర్గ పరిధిలో మొత్తం 74 మందికి దాదాపు రూ.50లక్షల సీఎంఆర్ఎఫ్, ఎల్వోసీలను అందిస్తున్నట్లు తెలిపారు. అనంతరం ప్రభుత్వ దవాఖానలో ఏర్పాటు చేసిన ఉచిత కంటి పరీక్ష శిబిరంలో పాల్గొని పరీక్షలు చేయించుకున్న వారికి పండ్లు పం పిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ ముద్దప్ప దేశ్ముఖ్, పీఏసీఎస్ అధ్యక్షుడు కటకం శివకుమార్, నియోజకవర్గ అధి కార ప్రతినిధి టీటీ రాములు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దామోదర్రెడ్డి, మార్కె ట్ కమిటీ వైస్ చైర్మన్ భీములు, పర్సా పూర్, హస్నాబాద్ సర్పంచ్లు సయ్యద్ అంజద్, పకీరప్ప, ఎంపీటీసీలు గోవిం ద మ్మ, మున్సిపల్ కౌన్సిలర్ మధుసూదన్ యా దవ్, టీఆర్ఎస్ నాయకులు సిద్ది లింగప్ప, నాగేశ్వర్రావు, సురేష్, ఎంట్ల మల్లయ్య పాల్గొన్నారు.