డబుల్ బెడ్ రూం ప్రారంభానికి సిద్ధ చేయాలి
మెడికల్ కళాశాల నిర్మాణాలు వేగం పెంచాలి
సంగారెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతరావు
సంగారెడ్డి అర్బన్, నవంబర్ 29 : జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు వేగవంతంగా పూర్తి చేయాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతరావు సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ధాన్యం కొనుగోళ్ల పురోగతి, డబుల్ బెడ్ రూం ఇండ్లు, కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ, మెడికల్ కళాశాల నిర్మాణ పనుల పురోగతిపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించి దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఏరోజుకారోజు ట్యాబ్ ఎంట్రీ పూర్తి చేయాలని, ఎంట్రీలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని వెంట వెంటనే తూకం వేసి రైస్ మిల్లులకు పంపించాలని సూచించారు. సకాలంలో ధాన్యం కొనుగోలు సంబంధించి చెల్లింపులు పూర్తి చేయాలన్నారు. జిల్లాలో డబుల్ బెడ్ రూం ఇండ్లను వేగవంతం చేసి ప్రారంభానికి సిద్ధం చేయాలన్నారు. కరోనా నివారణకు వ్యాక్సినేషన్ రక్షణ కవచం లాంటిదని, 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ విధిగా వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు. వైద్య కళాశాల నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఈ సమీక్షలో అదనపు కలెక్టర్లు రాజర్షి షా, వీరారెడ్డి, డీఆర్డీవో శ్రీనివాస్రావు, డీసీవో ప్రసాద్, ఆర్అండ్బీ ఈఈ సురేశ్, పీఆర్ ఈఈ జగదీశ్వర్, సివిల్ సైప్లె డీఎం సుగుణ బాయి, డీఈలు తదితరులు పాల్గొన్నారు.