ఏడుపాయలలో భక్తుల సందడి..
పాపన్నపేట, నవంబర్ 28 : పవిత్ర పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గా భవానీ మాతను ఆదివారం పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. ఆదివారం సెలవుదినం కావడంతో సుదూర ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి, మంజీర నదిలో పుణ్యస్నానాలు చేసి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం భక్తులు అమ్మవారికి ఒడిబియ్యం, కుంకుమార్చన, బోనాలు, తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ ఈవో సార శ్రీనివాస్, సిబ్బంది సూర్య శ్రీనివాస్, రవివీర్కుమర్, మధుసూదన్రెడ్డి అన్ని ఏర్పాట్లు చేశారు. పాపన్నపేట ఎస్సై సురేశ్ తమ సిబ్బందితో బందోబస్తు చేపట్టారు. కాగా, ఏడుపాయల వనదుర్గా భవానీమాతను ఎమ్మెల్సీ శేరి సుభాశ్రెడ్డి తమ కుటుంబ సభ్యులతో కలసి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్సీకి ఆలయ ఈవో ఆలయ మర్యాదలతో ఘనస్వాగతం పలికి సన్మానించారు.
వైభవంగా సేవాలాల్ మహరాజ్ విగ్రహ ప్రతిష్ఠాపన..
మెదక్రూరల్, నవంబర్ 28 : మండల పరిధిలోని పాతూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని చీపురుదుబ్బ తండాలో గిరిజనుల ఆధ్వర్యంలో నిర్మించిన సేవాలాల్ మహరాజ్ దేవాలయంలో ఆదివారం విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాశ్రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గిరిజనులు ఎమ్మెల్సీకి తలపాగా ధరించి ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లింగమ్మ, టీఆర్ఎస్ నాయకులు బాలయ్య, శ్రీనివాస్, జయపాల్రెడ్డి, నోముల శ్రీకాంత్, దేవాగౌడ్, మహిపాల్రెడ్డి, యామిరెడ్డి, టీఆర్ఎస్ యువ నాయకులు అజ్మీరాస్వామి నాయక్, శ్రీనుతో పాటు గిరిజనులు తదితరులు పాల్గొన్నారు. కాగా, చీపురుదుబ్బా తండాలోని హనుమాన్ దేవాలయంలో ఆదివారం సీఎం రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాశ్రెడ్డి స్వామి వారిని దర్శించుకొని పూజలు నిర్వహించారు. తాను ఎంతగానో ఇష్టపడే దత్తాత్రేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠాపనకు అవసరమైన సహాయసహకారం అందిస్తానని తెలిపారు.