సుల్తాన్బజార్, నవంబర్ 28: ఇండో-పాక్ యుద్ధంలో ప్రాణాలర్పించిన అమరవీరులను స్మరించుకోవడం అభినందనీయమని ఎన్సీసీ గ్రూప్ కమాండర్ కల్నల్ ఏకే కుల్శ్రేష్ట అన్నారు. ఆదివారం తెలుగు రాష్ర్టాల ఎన్సీసీ డైరెక్టరేట్, అబిడ్స్లోని లిటిల్ ఫ్లవర్ హైస్కూల్ ఆధ్వర్యంలో ఆజాదీకా అమృత్ మహోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 1971లో జరిగిన ఇండియా- పాకిస్థాన్ యుద్ధంలో వీరోచితంగా పోరాడి అసువులు బాసిన అశోక్కుమార్, మహమూద్ అలీ, సయ్యద్ అబ్దుల్ సమద్, దౌత్ఖాన్, అబ్దుల్ అజీజ్ను స్మరించుకుంటూ వారి కుటుంబ సభ్యులను సన్మానించుకోవడం గొప్ప విషయమన్నారు. లిటిల్ ఫ్లవర్ హైస్కూల్ బ్రదర్ షాజహాన్ ఆంటోని మాట్లాడుతూ జవాన్ల సేవలను ప్రతిఒక్కరూ గుర్తించుకోవాలన్నారు. ఎన్సీసీ అధికారులు సంపత్కుమార్, అమర్నాథ్లు మాట్లాడుతూ ఎన్సీసీలో చేరిన విద్యార్థుల్లో దేశభక్తిని నింపుతున్నామన్నారు. అనంతరం విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమంలో సీవో లెఫ్ట్ కల్నల్ బీటి రామయ్య, ఆల్ సేయింట్స్ , లిటిల్ఫ్లవర్ హైస్కూల్ ఫిజికల్ ట్రైనర్లు కుశ్వంత్ సింగ్, బ్రిజ్మోహన్ పాల్గొన్నారు.
1971 యుద్ధ అమరవీరుల కుటుంబాలకు..
మిలటరీ కార్యాలయంలోనూ స్వర్ణిమ్ విజయ్ వర్ష్ ఆజాదీకా అమృత్ మహోత్సవ్ వేడుకలను నిర్వహించారు. ఇందులో పాల్గొన్న ఎస్సీసీ గ్రూప్ కమాండర్ కల్నల్ కులశ్రేష్ట అమరవీరుల కుటుంబ సభ్యలను సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడాలంటే సంసిద్ధంగా ఉండాలన్నారు.