బాదం మిల్క్ బాటిళ్లు సీజ్
బియ్యం ప్యాకెట్ల శాంపిల్ సేకరణ
హైదరాబాద్ సెంట్రల్ ల్యాబ్కు తరలింపు
జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ ఉదయ్కిరణ్
రామాయంపేట, నవంబర్ 27: రామాయంపేట పట్టణంలో ఉన్న హెరిటేజ్ ఫ్రెష్ ను అధికారులు తనిఖీ చేశారు. నమస్తే తెలంగాణ కథనానికి జిల్లా యంత్రాంగం స్పందించి శనివారం రామాయంపేట హెరిటేజ్ షాప్లో శాంపిళ్లను సేకరించారు. రామాయంపేటకు చేరుకున్న జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ ఉదయ్కిరణ్ షాప్లోని వ స్తువులను తనిఖీ చేశారు. అనుమానం వచ్చిన బియ్యం ప్యాకెట్లను, 25 లీటర్ల బాదం పాలు బాటిళ్లను సీజ్ చేసి హైదరాబా ద్లోని సెంట్రల్ ఫుడ్ ల్యాబ్కు తరలిస్తున్నట్లు తెలిపారు. అనం తరం ఫుడ్ ఇన్స్పెక్టర్ ఉదయ్ కిరణ్ విలేకర్లతో మా ట్లాడారు. ప్రభుత్వ అనుమతి లేకుండా విక్రయాలు జరిపితే ఎంతటి వారిపై నైనా కేసులు తప్పవని హెచ్చరి ంచారు. తమకు అందిన ఫిర్యాదు మేరకు హెరిటేజ్ లోని వస్తువులను తనిఖీ చేశామని ఆ శాంపిళ్లను ల్యాబ్కు తరలిస్తున్నట్లు తెలిపారు. ల్యాబ్లో నకిలీవని తెలితే చర్య లు తీసుకుంటామన్నారు. ఈ తనిఖీలో వినియోగదారుల ఫోరం జిల్లా అధ్యక్షుడు రవికాంత్, మున్సి పల్ కమిషనర్ శ్రీనివాసన్, మేనేజర్ శ్రీనివాస్, సిబ్బంది రాఘవేందర్, ప్రభుదాస్, సాయికుమార్, జయరాజు, ప్రసాద్ తదితరులున్నారు.
పట్టణంలో దుకాణాల తనిఖీ
తూప్రాన్ పట్టణంలోని కిరాణా దుకాణాలను తనిఖీ చేసినట్లు ఫుడ్ ఇన్స్పెక్టర్ ఉదయ్కిరణ్ తెలిపారు.శనివారం పట్టణంలోని రెండు దుకాణాలను తనిఖీ చేసి శాంపిళ్లను తీసుకెళ్లినట్లు తెలిపారు. దుకాణదారులు నాణ్యతగల వస్తువులనే విక్రయించాలని , లేకుంటే చర్యలు తీసుకుంటామన్నారు.