సంగారెడ్డి మున్సిపాలిటీ, నవంబర్ 27 : కోత, కుట్టు లేకుండా నోస్కాల్ పెల్ వాసెక్టమీ ప్రత్యేక శిబిరాలు ఈ నెల 27 నుంచి ప్రారంభమైనట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ గాయత్రీదేవి తెలిపారు. శనివారం డీఎంఅండ్హెచ్వో కార్యాలయంలోని చాంబర్లో ప్రత్యేక వాసెక్టమీ శిబిరాలకు సంబంధించిన కరపత్రాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా డీఎంఅండ్హెచ్వో మాట్లాడారు. పురుషులకు వాసెక్టమీ (ఎన్ఎస్వీ) కుటుంబ నియంత్రణ శిబిరం ఈ నెల 27 నుంచి డిసెంబర్ 4వ తేదీ వరకు నిర్వహించనున్నటట్లు తెలిపారు. పురుషులు కోతకుట్టు లేని నోస్కాల్ పెల్ వెసెక్టమి చేయించుకుని ప్రభుత్వం అందించే రూ.1,100 పారితోషికం పొందాలని అన్నారు. 29వ తేదీన ప్రాంతీయ ఆరో గ్య కేంద్రం పటాన్చెరు, 30న జిల్లా ప్రభుత్వ దవాఖాన సంగారెడ్డి, డిసెంబర్ 1వ తేదీన ప్రాంతీయ ఆరోగ్య కేంద్రం జహీరాబాద్, 2న ప్రాంతీయ ఆరోగ్య కేంద్రం పటాన్చెరు, 3న జిల్లా ప్రభుత్వ దవాఖాన సంగారెడ్డి, 4న ప్రాం తీయ ఆరోగ్య కేంద్రం పటాన్చెరులో ప్రత్యేక వాసెక్టమీ శిబిరాలు నిర్వహించనున్నామని తెలిపారు. కార్యక్రమంలో డీఎంఅండ్హెచ్వో సిబ్బ ంది, జిల్లా దవాఖాన సిబ్బంది పాల్గొన్నారు.