కొద్దిమంది మధ్యే గణతంత్ర వేడుకలు
జాతీయ జెండా ఎగురవేసిన కలెక్టర్, ఎమ్మెల్యేలు
కొవిడ్ నిబంధనలు పాటిస్తూ సంబురాలు
నల్లగొండ, జనవరి 26;కొవిడ్ నిబంధనలను పాటిస్తూనే 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలను జిల్లావ్యాప్తంగా జరుపుకొన్నారు. బుధవారం ఉదయం 10 గంటలకు కలెక్టరేట్లో కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఒమిక్రాన్ వ్యాప్తికి ఆస్కారం ఇవ్వకుండా ప్రభుత్వం నిర్ణయం మేరకు కొద్దిమంది అధికారులు, ఉద్యోగులతో సాదాసీదాగా వేడుకలు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లి, అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందేలా అధికార యంత్రాంగం అహర్నిశలు కృషి చేయాలని కలెక్టర్ కోరారు. ఎమ్మెల్యేలు భాస్కర్రావు, చిరుమర్తి, భూపాల్రెడ్డి, భగత్ ఆయా నియోజకర్గ కేంద్రాల్లో మువ్వన్నెల జెండాను ఎగురవేశారు. కలెక్టర్లో నిర్వహించిన వేడుకల్లో జడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ కోటిరెడ్డి, ఎస్పీ రెమారాజేశ్వరి
పాల్గొన్నారు.
రిపబ్లిక్ డే వేడుకలను బుధవారం జిల్లా అంతటా నిరాడంబరంగా నిర్వహించారు. కొవిడ్ వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఎక్కువ మంది జనం గుమికూడకుండా సాదాసీదాగా జెండా ఆవిష్కరణ చేశారు. కలెక్టరేట్లో కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. జడ్పీ చైర్మన్ బండ నరేందర్రెడ్డి, ఎమ్మెల్సీ కోటిరెడ్డి, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, ఎస్పీ రెమా రాజేశ్వరి నాయకులు పాల్గొన్నారు. అదే విధంగా నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ హాలియాలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జెండా ఆవిష్కరించారు. మిర్యాలగూడ, నకిరేకల్ ఎమ్మెల్యేలు నల్లమోతు భాస్కర్రావు, చిరుమర్తి లింగయ్య తమ క్యాంపు కార్యాలయాల్లో జాతీయ జెండాను ఎగురవేశారు.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో అర్హులందరికీ అందేలా అధికారులు పనిచేయాలని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అన్నారు. 73వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం ఆయన కలెక్టరేట్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. కొవిడ్ వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి నిరాడంబరంగా గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవం అనేది ప్రతి ఒక్కరికీ పండుగ లాంటిదని పేర్కొన్నారు. ప్రపంచంలోనే భారత రాజ్యాంగం చాలా గొప్పదని, రాజ్యాంగం వల్ల మన దేశం గొప్ప సర్వ సత్తాక, ప్రజాస్వామ్య దేశంగా ప్రజ్వరిల్లుతున్నట్లు తెలిపారు. ప్రభుత్వం చేపడుతున్న ప్రతి పథకం అర్హులందరికీ అందడానికి రాజ్యంగమే కారణమని అన్నారు. భారత స్వాతంత్య్రం కోసం పోరాడి అమరులైన ప్రతి ఒక్కరినీ స్మరించుకుని నివాళులర్పించాలని పేర్కొన్నారు. ఎస్పీ, ఎమ్మెల్యేలతో పాటు మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేశ్, అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, రాహుల్ శర్మ, ట్రైనీ కలెక్టర్ అపూర్వ్ చౌహాన్తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.