జిల్లా అధ్యక్షురాలిగా ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి
నియామకంపై హర్షం
హవేళీఘనపూర్/చిన్నశంకరంపేట/పాపన్నపేట/రామాయంపేట/మనోహరాబాద్/నిజాంపేట/మెదక్ మున్సిపాలిటీ, జనవరి 26: టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలిగా ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డిని సీఎం కేసీఆర్ నియమించడంపై బుధవారం జిల్లా కేంద్రంలో టీఆర్ఎస్ శ్రేణులు సంబురాలు జరుపుకొన్నారు. మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ ఆధ్వర్యంలో రాందాస్ చౌరస్తాలో పటాకులు కాల్చారు. టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు గంగాధర్, మార్కెట్ కమిటీ చైర్మన్ బట్టి జగపతి మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ రాగి అశోక్, కౌన్సిలర్లు టీఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి గడ్డమీది కృష్ణాగౌడ్, యువత అధ్యక్షుడు బానీ, నాయకులు పాల్గొన్నారు. నిజాంపేటలో ఎంపీపీ సిద్ధిరాములు ఆధ్వర్యంలో టీఆర్ఎస్ శ్రేణులు సంబురాలు జరుపుకొన్నారు. తూప్రాన్ పట్టణ కేంద్రంలో నాయకులు సంబురాలు నిర్వహించారు. మున్సిపల్ చైర్మన్ బొంది రవీందర్గౌడ్, వైస్ చైర్మన్ శ్రీనివాస్ పాల్గొన్నారు.రామాయంపేటలో టీఆర్ఎస్ నాయకులు సంబురాలు నిర్వహించుకున్నారు. టీఆర్ఎస్ క్యాంప్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్గౌడ్, ఏఎంసీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, పీఏసీఎస్ చైర్మన్ బాదె చంద్రం, పట్టణాధ్యక్షుడు గజవాడ నాగరాజు, యాదగిరిల సమక్షంలో పార్టీ కార్యాలయం వద్ద టపాసులు పేల్చి స్వీట్లు పంచారు. పాపన్నపేట సుభాష్ చంద్రబోస్ విగ్రహం వద్ద మిఠాయిలు పంచుకుంటూ టీఆర్ఎస్ నేతలు సంబురాలు నిర్వహించారు. పాపన్నపేట టీఆర్ఎస్ అధ్యక్షుడు విష్ణువర్ధన్రెడ్డి, సర్పంచ్ గురుమూర్తిగౌడ్, నేతలు పాల్గొన్నారు. చిన్నశంకరంపేట స్థానిక బస్టాండ్ వద్ద మెదక్-చేగుంట ప్రధాన రహదారిపై టపాసుటు కాల్చి,మిఠాయిలు పంచుకుంటూ సంబురాలు చేసుకున్నారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రాజు, సర్పంచ్లు రాజిరెడ్డి, శ్రీనివాస్రెడ్డి యాదగిరి యాదవ్, లక్ష్మణ్, సింగిల్విండో చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, కుమార్గౌడ్ నేతలు పాల్గొన్నారు. హవేళీఘనపూర్లో జడ్పీ వైస్ చైర్మన్ లావణ్యరెడ్డి, మండల సర్పంచ్లు, ఎంపీటీసీల ఆధ్వర్యంలో పటాకులు కాల్చి సంబురాలు నిర్వహించారు.