కమాన్పూర్, నవంబర్ 24: ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల్లో సైన్స్ పరిజ్ఞానాన్ని పెంపొందించేందుకు జిల్లా వ్యాప్తంగా మొబైల్ సైన్స్ ల్యాబ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పెద్దపల్లి డీఈవో డీ మాధవి పేర్కొన్నారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలోని విద్యార్థులకు బుధవారం మొబైల్ సైన్స్ ల్యాబ్ నిర్వహణపై సైన్స్ ఉపాధ్యాయులు అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన డీఈవో పాఠశాలలో ఏర్పాటు చేసిన పలు ప్రయోగాలను పరిశీలించి మాట్లాడారు. విద్యార్థులు పరిశోధనలు, పరిశీలనపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. విద్యార్థుల్లో సైన్స్పై పరిజ్ఞానం పెంపొందించే దిశలో భాగంగానే మొబైల్ సైన్స్ ల్యాబ్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని వెల్లడించారు. ఇక్కడ మండల విద్యాధికారి పల్లెపాటి సంపత్రావు, మొబైల్ సైన్స్ ల్యాబ్ రిసోర్స్ పర్సన్స్ వేముల జ్ఞానేందర్, టీ సంపత్ కుమార్, వెంకటరమణ, ఆర్పీలు గీట్ల భరత్రెడ్డి, మల్లేశ్వర్రావు, లక్ష్మణ్, దశరథం, కుమార్, దేవేందర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
కల్వచర్లలో ప్రయోగాల ప్రదర్శన
రామగిరి, నవంబర్ 24: కల్వచర్ల జడ్పీహెచ్ఎస్లో బుధవారం సంచా ర ప్రయోగశాల ద్వారా విద్యార్థులకు సైన్స్పై అవగాహన కల్పించారు. రిసోర్స్ పర్సన్స్ దశరథం, డీ కుమార్, దేవేందర్, జీవశాస్త్ర ప్రయోగాలను ప్రదర్శించారు. గణిత ప్రయోగాలను భరత్రెడ్డి, లక్ష్మణ్, మల్లేశ్వర్రావు ప్రదర్శించారు. భౌతికశాస్త్ర ప్రయోగాలను వెంకటరమణ, జ్ఞానేందర్, సంపత్కుమార్ వివరించారు. ఇక్కడ హెచ్ఎం దేవేందర్రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉన్నారు.