తుది నిర్ణయం దళితబంధు లబ్ధిదారులదే..
ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో లబ్ధిదారుల ఎంపిక ఫిబ్రవరి 3లోగా ఎంపికకు యంత్రాంగం చర్యలు
మార్చి 7లోగా జిల్లాలో గ్రౌండింగ్ ప్రక్రియ పూర్తి
జిల్లాకు రూ.70 కోట్ల నిధులు మంజూరు
జిల్లావ్యాప్తంగా 1,18,514 ఎస్సీ కుటుంబాలు
దళితబంధుపై రంగారెడ్డి కలెక్టర్ డి.అమయ్కుమార్తో ఇంటర్వ్యూ..
రంగారెడ్డి, జనవరి 24, (నమస్తే తెలంగాణ);‘దళితులు ఆర్థిక సాధికారతను సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘దళితబంధు’కు శ్రీకారం చుట్టింది. ఎంపికైన లబ్ధిదారులు నచ్చిన బిజినెస్ను ఎంచుకోవచ్చు.. ఫిబ్రవరి 3వ తేదీ వరకల్లా ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేసేందుకు జిల్లాయంత్రాంగం చర్యలు తీసుకుంటున్నది…’ అని రంగారెడ్డి కలెక్టర్ అమయ్కుమార్ సోమవారం ప్రత్యేక ఇంటర్వ్యూలో తెలిపారు. నియోజకవర్గానికి వంద మంది చొప్పున ఎంపిక చేసి, మార్చి 7లోగా గ్రౌండింగ్ ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు పేర్కొన్నారు. దళితబంధు కింద రంగారెడ్డి జిల్లాకు రూ.70 కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. ఒక్కో లబ్ధిదారుడికి సంబంధించి రూ.10 లక్షల నుంచి రూ.10వేల చొప్పున వారి రక్షణ నిధికి కేటాయించి ఆపద సమయంలో కేటాయించనున్నట్లు వివరించారు. రంగారెడ్డి జిల్లాలో 1,18,514 ఎస్సీ కుటుంబాలు ఉన్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు.
దళిత కుటుంబాలు ఆర్థికాభివృద్ధి సాధించేందుకు సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన దళితబంధు పథకాన్ని ఈ ఆర్థిక సంవత్సరంలోనే రాష్ట్రమంతా అమలుచేసేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతున్నది. ప్రతీ నియోజకవర్గంలో వందమంది లబ్ధిదారులను ఎంపిక చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఫిబ్రవరి 5వ తేదీలోగా లబ్ధిదారులను ఎంపిక చేసి, మార్చి మొదటి వారం నాటికి 100 శాతం గ్రౌండింగ్ చేయాలని ఆదేశించింది. కాగా ఆయా నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో లబ్ధిదారులను ఎంపిక చేసిన జాబితాలను జిల్లా ఇన్చార్జి మంత్రి ఆమోదానికి పంపిం చనున్నారు. అదేవిధంగా ఎంపిక చేసిన లబ్ధిదారులందరికీ రూ. 10 లక్షల చొప్పున ప్రభుత్వం ఆర్థిక సాయాన్ని అందించనుంది. అంతేకాకుండా లబ్ధిదారుడు కోరుకున్న యూనిట్నే ఎంపిక చేయనున్నారు. అయితే ఒక్కో లబ్ధిదారుడికి మంజూరయ్యే రూ. 10లక్షల యూనిట్ నుంచి రూ.10వేలతో దళితబంధు రక్షణనిధిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. లబ్ధిదారుల్లో ఎవరికైనా ఆపద వచ్చినప్పుడు ఈ రక్షణనిధి నుంచి వారికి సాయం అందించనున్నారు. అయితే ఈ ఆర్థిక సంవత్సరంలోనే లబ్ధిదారులకు రూ.10 లక్షల యూ నిట్ను గ్రౌండింగ్ చేయనున్నారు. అయితే దళితబంధును క్షేత్రస్థాయిలో ఏ విధంగా అమలుచేయనున్నారు, లబ్ధ్దిదారుల ఎంపిక ఏ విధంగా జరుగనుంది, లబ్ధిదారుల ఎంపికలో ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేల పాత్ర ఏమిటి.. జిల్లాలో దళితుబంధు అమలుకు ఎన్ని నిధులు అవసరం, యూని ట్ల మంజూరులో ప్రభుత్వ ఆదేశాలు పాటిస్తారా..?, లబ్ధిదారులు కోరుకున్న యూనిట్ను మంజూరు చేస్తారా..? తదితర అం శాలపై పూర్తి స్పష్టతనిచ్చేందుకు రంగారెడ్డి కలెక్టర్ అమయ్కుమార్తో నమస్తే తెలంగాణ ప్రతినిధి ప్రత్యేక ఇంటర్వ్యూ..
ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం దళితబంధు పథకాన్ని క్షేత్రస్థాయిలో పకడ్బందీగా అమలుచేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. మొదట లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేసి.. ప్రతి మండలంలో అనువైన బ్యాంకు నుంచి కుటుంబ పెద్ద పేరుతో ప్రత్యేకంగా దళితబంధు బ్యాంకు ఖాతాను తెరిపి స్తాం. లబ్ధిదారుకు ప్రభుత్వం మంజూరు చేసే రూ.10 లక్షల యూనిట్ నుంచి రూ.10 వేలతో రక్షణనిధిని ఏర్పాటు చేయి స్తాం. ఆ నిధులు భవిష్యత్తులో ఏదైనా ఆపదొస్తే ఉపయోగపడుతాయి. అదేవిధంగా ఎంపిక ప్రక్రియ అనంతరం లబ్ధ్దిదారులతో గ్రామ, మండల కమిటీలను ఏర్పాటు చేసి, ఆయా కమిటీలతో సమావేశమై మీరు ప్రస్తుతం ఏం చేస్తున్నారు, ఏ వ్యాపారంపై మీకు నైపుణ్యం ఉందనే వివరాలను సేకరించి యూనిట్లను గ్రౌండింగ్ చేస్తాం. అంతేకాకుండా లబ్ధిదారులు ఎంపిక చేసిన యూనిట్లను బట్టి వారికి నైపుణ్యాన్ని అందించేందుకు ప్రత్యేక శిక్షణ కూడా ఇప్పిస్తాం. అదేవిధంగా జిల్లాస్థాయిలో రవాణా(వాహనాలు), సర్వీసు(సూపర్ మార్కెట్ తదితరాలు) తదితర కమిటీలుంటాయి. లబ్ధిదారులు కోరుకున్న యూనిట్ను బట్టి ఆయా కమిటీలు యూనిట్లను లబ్ధిదారులకు మంజూరు చేస్తాయి.
సమన్వయ సమావేశం..
లబ్ధిదారుల ఎంపిక అనంతరం కో-ఆర్డినేషన్ సమావేశాన్ని నిర్వహిస్తాం. లబ్ధిదారులకు గ్రౌండింగ్ మంజూరు చేసే సమయంలో కో-ఆర్డినేషన్ సమావేశాన్ని వ్యవసాయాధికారి, రవాణాశాఖ అధికారి, పశుసంవర్ధక శాఖ తదితర అధికారులతో కలిసి నిర్వహిస్తాం.
జిల్లాకు అవసరమయ్యే నిధులు
రంగారెడ్డి జిల్లాలో 1,18,514 దళిత కుటుంబాలున్నాయి. చేవెళ్ల నియోజకవర్గంలో 17,019 కుటుంబాలు, ఇబ్రహీంపట్నంలో 22,060, ఎల్బీనగర్లో 15,656, మహేశ్వరంలో 12,820 , శేరిలింగంపల్లిలో 11,442, రాజేంద్రనగర్లో 17820, షాద్నగర్లో 13,114, కల్వకుర్తి నియోజకవర్గంలో 8,583 కుటుంబాలున్నాయి. అదేవిధంగా జిల్లాలో 4,47,888 ఎస్సీ జనాభా ఉండగా, జిల్లా మొత్తం జనాభాలో 15.40 శాతంగా వారు ఉన్నారు. అయితే దళితబంధు కింద నియోజకవర్గానికి 100 మంది లబ్ధిదారులకు మార్చి 7లోగా గ్రౌండింగ్ చేయనున్న దృష్ట్యా జిల్లాకు రూ. 65-70 కోట్ల నిధులు అవసరం. అయితే జిల్లాలో చేవెళ్ల, షాద్నగర్, మహేశ్వరం, ఎల్బీనగర్, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, కల్వకుర్తి నియోజకవర్గాలున్నాయి, ఒక్కో నియోజకవర్గం నుంచి వంద మంది లబ్ధిదారులను ఎంపిక చేయనున్న దృష్ట్యా నియోజకవర్గానికి రూ.10 కోట్ల చొప్పున ప్రభుత్వం మంజూరు చేయనున్నది. అయితే కల్వకుర్తి నియోజకవర్గంలోని నాలుగు మండలాలు మాత్రమే రంగారెడ్డి జిల్లాలో ఉన్నాయి. మిగతా రెండు మండలాలు నాగర్కర్నూల్ జిల్లా లో ఉన్నాయి కాబట్టి స్థానిక ఎమ్మెల్యే నిర్ణయం మేరకు నిధులు విడుదల కానున్నాయి.
కోరుకున్న యూనిట్లే మంజూరు..
దళితబంధు పథకంలో భాగంగా లబ్ధిదారులు కోరుకున్న యూనిట్లనే మంజూరు చేస్తాం. అయితే లబ్ధిదారుడి సామర్థ్ధ్యం, అనుభవం, ప్రాధాన్యం, పెట్టుబడి స్థాయి, స్థానిక అవసరాలను కూడా పరిగణనలోకి తీసుకొని యూనిట్ తుది ఎంపిక జరుగుతుంది. లబ్ధ్దిదారులు ఎంపిక చేసుకున్న యూనిట్తో ఉపాధి పొందడంతోపాటు ఆర్థికంగా వృద్ధి చెందాలి కాబట్టి అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని, లబ్ధిదారులకు అవగాహ న కల్పించి, దళిత కుటుంబాలు ఆర్థికంగా బలోపేతమయ్యేలా యూనిట్లను ఎంచుకునేలా చర్యలు తీసుకుంటాం. ఈ ప్రక్రియ పూర్తి అయిన తర్వాతే యూనిట్ను గ్రౌండింగ్ చేసేందుకు అనుమతిస్తాం. లబ్ధిదారులు ఎంపిక చేసుకున్న యూనిట్కు అవసరమైన నైపుణ్యాన్ని అందించేందుకు ప్రత్యేక శిక్షణ కూడా ఇప్పిస్తాం. అయితే రూ.10 లక్షల్లో మంజూరు చేసే యూనిట్లకు సంబంధించి మినీ డైరీ, ట్రాక్టర్-ట్రాలీ, కోడి పిల్లల పెంపకం, వరినాటు యంత్రం, పం దిరి కూరగాయల సాగు, ఏడుగురు కూర్చునే సామర్థ్యంగల ఆటో, ఆటో రిక్షా, సరుకు రవాణా ఆటో, ఐరన్ గేట్స్-గ్రిల్స్ తయారీ యూనిట్-ఆటో, కాంక్రీట్ మిశ్రమం తయారీ యంత్రం, సెంట్రింగ్, మట్టి ఇటుకల తయారీ-ఆటోట్రాలీ, ఆయిల్మిల్, బియ్యం, పసుపు గిర్ని, మెడికల్, జనరల్ స్టోర్స్, మినీ సూపర్ బజార్, ఎలక్ట్రానిక్ పరికరాల అమ్మకం-సేవలు, ఎలక్ట్రికల్ షాప్-మోటార్ వైండింగ్- బ్యాటరీ సేవలు, హార్డ్వేర్-శానిటరీ దుకాణం, విత్తనాలు-ఎరువుల-క్రిమిసంహారక మందుల షాపు, వ్యవసాయ సాగుకోసం యంత్ర పరికరాల అమ్మకం, హోటల్-క్యాటరింగ్, డీటీపీ-మీసేవ-సీఎస్సీ ఆన్లైన్ సెంటర్-ఫొటో స్టూడియో, డయాగ్నస్టిక్ ల్యాబ్-మెడికల్ షాప్, టెంట్హౌస్-డెకరేషన్-లైటింగ్-సౌండ్ సిస్టం వంటి యూనిట్లతోపాటు లబ్ధిదారులు కోరుకునే ఇతర యూనిట్లను మంజూరు చేస్తాం.
లబ్ధిదారుల ఎంపికలో ఎమ్మెల్యేల పాత్ర
దళిత కుటుంబాలు ఆర్థికాభివృద్ధి సాధించాలనే లక్ష్యం గా సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని తీసుకొచ్చా రు. ఈ పథకంలో భాగంగా నియోజకవర్గానికి వంద మంది చొప్పున లబ్ధిదారులను ఎంపిక చేయనున్నా రు. అయితే లబ్ధిదారుల ఎంపిక అంతా ఆయా నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో జరుగనున్నది. లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి ప్రభు త్వం నుంచి స్పష్టమైన మార్గదర్శకాలు జారీ కావాల్సి ఉన్నది. కాగా ఎమ్మెల్యేలు ఎంపిక చేసిన లబ్ధిదారుల జాబితాలను జిల్లా ఇన్చార్జి మంత్రి ఆమోదానికి పం పిస్తారు. లబ్ధిదారుల ఎంపికలో 60-65 ఏండ్ల లోపు వారిని పరిగణనలోకి తీసుకోనున్నారు. ఒకే కుటుంబంలో ఇద్దరు అన్నదమ్ములు ఉన్నట్లయితే వారి మధ్య విభేదాలు రాకుండా ఒక్కొక్కరికి రూ.5లక్షల చొప్పున యూనిట్లను గ్రౌండింగ్ చేయనున్నారు.