అపోహలు వీడి వ్యాక్సిన్ వేయించుకోవాలి
ప్రతీ వారం ఉచిత వైద్యశిబిరం
చేవెళ్ల ఎంపీ డాక్టర్ రంజిత్రెడ్డి
ధారూరు, జనవరి 23 : ఆర్ ఆర్ ఫౌండేషన్ ప్రతి ఒక్కరికీ అండగా ఉంటుందని చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్రెడ్డి తెలిపారు. ఆదివారం ధారూరు మండలం మోమిన్కలాన్ గ్రామంలో ఆర్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్తో కలిసి గ్రామంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి వైద్య శిబిరం వరకు ర్యాలీగా వెళ్లారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకొని ఆరోగ్యాలను కాపాడుకోవాలన్నారు. రాజకీయాల్లోకి వచ్చి రెండున్నర సంవత్సరాలైందని, ముఖ్యంగా విద్య, వైద్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సీఎం కేసీఆర్ రూ.7కోట్లు కేటాయించారన్నారు. పాఠశాలల్లోని మౌలిక వసతులను అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలని ఈ నిధులను కేటాయించినట్లు తెలిపారు. ప్రతి గ్రామానికి కార్పొరేట్ వైద్య సేవలను అందించాలనే లక్ష్యంతో ఆర్ఆర్ ఫౌండేషన్ తరపున గ్రామాల్లో వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలు అపోహలు వీడి చిన్నపాటి అనారోగ్యానికి గురైనా వైద్యులను సంప్రదించాలన్నారు.
సొంత వైద్యం తగదు..
ఎమ్మెల్యే ఆనంద్ మాట్లాడుతూ.. ప్రజలు సొంత వైద్యంతో ప్రాణాలకు ముప్పు తెచ్చుకోవద్దని తెలిపారు. వైద్యుల సలహాలు, సూచనలు పాటించి మందులు వాడి రోగాలను నయం చేసుకోవాలన్నారు. ప్రతిఒక్కరూ కరోనా వ్యాక్సిన్ వేసుకోవాలని.. ఎలాంటి ఆరోగ్య సమస్యలున్నా వైద్యుల సూచనలు తప్పక పాటించాలని సూచించారు. కరోనా వచ్చినవారు మూడు నెలల వరకు వ్యాక్సిన్ వేసుకోవద్దన్నారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పలు సమస్యలున్నాయని.. వాటిని పరిష్కరించాలని ఎంపీ రంజిత్రెడ్డికి వినతిపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు విజయలక్ష్మి, జడ్పీటీసీ సుజాత, పీఏసీఎస్ చైర్మన్ సత్యనారాయణరెడ్డి, సర్పంచ్ శ్రీనివాస్రెడ్డి, మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు వీరేశం, ఏఎంసీ చైర్మన్ సంతోష్కుమార్, పార్టీ మండల అధ్యక్షుడు రాజ్నాయక్, సీనియర్ నాయకులు వేణుగోపాల్రెడ్డి, హన్మంత్రెడ్డి, రామ్రెడ్డి, రాజుగుప్తా, నాయకులు జైపాల్రెడ్డి, శంకర్, బాబయ్య, యాదయ్య, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.