మరో 20 ఏళ్లూ టీఆర్ఎస్దే అధికారం
పార్టీ బాగుంటేనే మనం బాగుంటాం..
కార్యకర్తల కష్టాన్ని పార్టీ అధిష్ఠానం గుర్తిస్తుంది
కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు
పాల్వంచ, అక్టోబర్ 22: తెలంగాణలో మరో 20 ఏండ్లు టీఆర్ఎస్సే అధికారంలో ఉంటుందని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం పాత పాల్వంచలోని ఎమ్మెల్యే స్వగృహంలో పాల్వంచ పట్టణ, మండల కార్యకర్తల, ప్రజాప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ బాగుంటేనే మనం బాగుంటామని, మనం బాగుండాలంటే పార్టీని పటిష్టం చేయాలని సూచించారు. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ తెలంగాణలో అమలయ్యే సంక్షేమ పథకాలు లేవని, ప్రతి ఇంటికీ ఏదో ఒక ప్రభుత్వ పథకం అందుతుందన్నారు. పదవులు రాని వారు బాధపడాల్సిన అవసరం లేదని, పార్టీ అధిష్ఠానం కార్యకర్తల కష్టాన్ని గుర్తిస్తుందన్నారు. సరైన సమయంలో పదవులు కట్టబెడుతుందన్నారు. ప్రతిపక్షాల ఆరోపణలను కార్యకర్తలు తిప్పికొట్టాలన్నారు. వచ్చే నెల 15న వరంగల్లో జరిగే పార్టీ విజయ గర్జన సభను విజయవంతం చేయాలన్నారు. నియోజకవర్గం నుంచి పది వేల మంది కార్యకర్తలు తరలిరావాలన్నారు. దీనిపై ఈ నెల 27న కొత్తగూడెం క్లబ్లో నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహిస్తామన్నారు. సమావేశంలో టీఆర్ఎస్ నాయకుడు వనమా రాఘవేందర్రావు, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు, జడ్పీటీసీ బరపటి వాసుదేవరావు, ఎంపీపీ సరస్వతి, పార్టీ ముఖ్యనేతలు రాజుగౌడ్, పూసల విశ్వనాథం, మల్లెల శ్రీరామ్మూర్తి, ఎస్వీఆర్కే ఆచార్యులు, యర్రంశెట్టి ముత్తయ్య, రామలింగం, వెంకటేశ్వరరావు, కాల్వ భాస్కర్, చింతా నాగరాజు, కాల్వ ప్రకాశ్, దాసరి నాగేశ్వరరావు, బేతంశెట్టి విజయ్, ముత్యాల ప్రవీణ్, కనగాల నారాయణ, బడేటి రాజేశ్వరి, గురవయ్య, చిన్న వెంకట్రామయ్య, చిన్న వెంకటేశ్వర్లు, శంకర్ సాధు, సంతోశ్రెడ్డి, రమేశ్ పాల్గొన్నారు.