మంచిర్యాలటౌన్/బెల్లంపల్లి టౌన్/చెన్నూర్/జైపూర్/ మందమర్రి/హాజీపూర్/ఆసిఫాబాద్/కాగజ్నగర్ రూరల్, అక్టోబర్ 21 :విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు అమరవీరుల త్యాగాలను అధికారులు, ప్రజాప్రతినిధులు స్మరించుకున్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లా కేంద్రాల్లో నిర్వహించిన కార్యక్రమాల్లో జడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మి, కలెక్టర్ రాహుల్రాజ్, ఎస్పీ వైవీఎస్ సుధీంద్ర, మంచిర్యాల డీసీపీ ఉదయ్కుమార్రెడ్డి, ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు పాల్గొన్నారు. పోలీస్ అమరవీరుల స్తూపాల వద్ద నివాళులర్పించారు. వీరులకు జోహార్ అంటూ నినాదాలు చేశారు. పలుచోట్ల మెగా రక్తదాన శిబిరాలు నిర్వహించగా, పోలీసులు, యువకులు రక్తదానం చేశారు.
కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలో గురువారం పోలీసు అమర వీరుల సంస్మరణ దినం నిర్వహించారు. మంచిర్యాల సబ్డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. 650 యూనిట్ల రక్తాన్ని దాతలు అందించారు. తలసేమియా, సికిల్సెల్ రోగులు, రక్తహీనత కలిగిన రోగుల సహాయార్థం ప్రభుత్వ ఆస్పత్రిలోని రెడ్ క్రాస్ సొసైటీకి చెందిన బ్లడ్బ్యాంక్కు ఈ యూనిట్లను అందిస్తున్నట్లు పోలీసు అధికారులు ప్రకటించారు. మంచిర్యాలలోని ఎఫ్సీఐ హాల్లో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరానికి పలు ప్రాంతాలకు చెందిన యువకులు తరలివచ్చి రక్తాన్ని అందించారు. మంచిర్యాల డీసీపీ ఉదయ్కుమార్రెడ్డి, మంచిర్యాల ఏసీపీ అఖిల్ మహాజన్, రూరల్ సీఐ, లక్షెట్టిపేట సీఐ, పలువురు ఎస్సైలు రక్తదానం చేశారు. రక్తదానం చేసిన యువకులకు ప్రశంసా పత్రాలు అందించారు. పట్టణ సీఐ నారాయణ, రూరల్ సీఐ సంజీవ్ పాల్గొన్నారు. మంచిర్యాల పట్టణంలో ఏసీపీ అఖిల్ మహాజన్ ఆధ్వర్యంలో రాత్రి కొవ్వొత్తుల ర్యాలీ తీశారు. బస్టాండ్, మార్కెట్రోడ్, ముఖరాం చౌరస్తా, మెయిన్రోడ్ మీదుగా కొనసాగింది. బెల్లంపల్లి హెడ్ క్వార్టర్స్లో డీసీపీ ఉదయ్కుమార్రెడ్డి, ఏసీపీ అఖిల్ మహాజన్తో కలిసి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. పోలీస్ అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. పోలీసు ఉన్నతాధికారులు మల్లికార్జున్, రాజు, జగదీశ్, అనిల్కుమార్, అంజన్న ఉన్నారు. చెన్నూర్లో జైపూర్ ఏసీపీ నరేందర్ రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు.
సీఐ ప్రవీణ్కుమార్, పొక్కూర్ సర్పంచ్ కుక్కడపు నరేందర్, ఉప సర్పంచ్ మధూకర్తో పాటు పోలీసులు, సీఆర్పీఎఫ్ జవాన్లు, పలువురు దాతలు రక్త దానం చేశారు. ప్రభుత్వ దవాఖాన డాక్టర్ సత్యనారాయణ, ఎస్ఐలు వినోద్, విక్టర్, వెంకట్ ఉన్నారు. జైపూర్ మండలకేంద్రంలోగల ప్రభుత్వపాఠశాలలో 8 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ‘జాతి నిర్మాణంలో పోలీసుల పాత్ర’ అనే అంశం వ్యాస రచన పోటీలు నిర్వహించారు. పోటీల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు ప్రథమ, ద్వితీయ బహుమతులను ఏసీపీ నరేందర్ చేతులమీదుగా అందజేశారు. శ్రీరాంపూర్ సీఐ రాజు, జైపూర్ ఎస్ఐ రామకృష్ణ, అదనపు ఎస్ఐ గంగరాజగౌడ్, పీఎస్ఐ శ్రీకాంత్, హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు ఆలేస్ మాధూర్య ఉన్నారు. మందమర్రి పోలీస్ స్టేషన్ ఆవరణలోని పోలీస్ స్తూపం వద్ద మంచిర్యాల డీసీపీ ఉదయ్కుమార్రెడ్డి, ఏసీపీ ఎడ్ల మహేశ్, మందమర్రి సీఐ ప్రమోద్రావు, సర్కిల్ పరిధిలోని ఎస్సైలతో కలసి వారు పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. మందమర్రి ఎస్సై లింగంపెల్లి భూమేశ్ ఉన్నారు. హాజీపూర్ మండలం గుడిపేటలోని 13వ ప్రత్యేక తెలంగాణ పోలీస్ బెటాలియన్లోని పోలీసుల అమవీరుల స్తూపం వద్ద ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు, బెటాలియన్ ఇన్చార్జి కమాండెంట్ ఎంఐ సురేశ్తో కలిసి నివాళులు అర్పించారు.
అసిస్టెటెంట్ కమాడెంట్ రఘునాథ్ చౌహాన్, భిక్షపతి, గుడిపేట సర్పంచ్ లగిశెట్టి లక్ష్మి-రాజయ్య, ఎంపీటీసీ ఒడ్డె బాలరాజు, మాజీ వైస్ ఎంపీపీ మందపెల్లి శ్రీనివాస ఉన్నారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్క్వార్టర్స్లో జడ్పీ చైర్పర్సన్ కోవలక్ష్మి, కలెక్టర్ రాహుల్రాజ్, ఎస్పీ వైవీఎస్ సుధీంద్రతో కలిసి అమరవీరులకు నివాళులర్పించారు. జడ్పీ చైర్పర్సన్ కోవలక్ష్మి మాట్లాడుతూ పోలీసులు లేని సమాజాన్ని ఊహించలేమన్నారు. డీఎస్పీలు శ్రీనివాస్,కరుణాకర్, రిజర్వు ఇన్స్పెక్టర్లు శేఖర్బాబు, శ్రీనివాస్, చంద్రశేఖర్, ప్రతాప్ ఉన్నారు. కాగజ్నగర్ పట్టణంలోని ఈఎస్ఐ దవాఖానలో పోలీసుల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. జిల్లా ఎస్పీ వైవీఎస్ సుధీంద్ర పాల్గొన్నారు. కాగజ్నగర్ డీఎస్పీ కరుణాకర్, సీఐ రాజేంద్రప్రసాద్, ఎస్ఐలు వెంకటేశ్వర్లు, సందీప్కుమార్ పాల్గొన్నారు.