ఇంద్రవెల్లి, జనవరి 21: ఆదివాసుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని మాజీ ఎంపీ నగేశ్ పేర్కొన్నారు. మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణలో శుక్రవారం మండలంలోని పలు గ్రామాలకు చెందిన 55 మంది దండారీ నిర్వాహకులకు 10వేల చొప్పున ప్రభుత్వం మంజూరు చేసిన చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దీపావళి పండుగ సందర్భంగా ఆదివాసులు అత్యంత పవిత్రంగా నిర్వహించే దండారీ ఉత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో దండారీకి రూ.10వేల చొప్పున ఉమ్మడి జిల్లాలో రూ.కోటి మంజూరు చేసి అందజేస్తున్నదని తెలిపారు. కార్యక్రమంలో ఐటీడీఏ చైర్మన్ కనక లక్కేరావ్, ఎంపీపీ పోటే శోభాబాయి, పీఏసీఎస్ చైర్మన్ మారుతిపటేల్డోంగ్రే, ఏఎంసీ చైర్మన్ జాదవ్ శ్రీరాంనాయక్, ఎంపీటీసీలు జాదవ్ స్వర్ణలత, ఆశాబాయి, కోరెంగా సులోచన, కుమ్రం జంగుబాయి, కోవ రాజేశ్వర్, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు మహ్మద్ అబ్దుల్ అమ్జద్, సర్పంచ్లు గాంధారి, సోయం రాంబాయి, రాంచందర్, నాగోరావ్, మాజీ ఎంపీపీ కనక తుకారాం, మాజీ ఎంపీటీసీ కనక హనుమంత్రావ్, టీఆర్ఎస్ నాయకులు దేవ్పూజే మారుతి, షేక్ సుఫియాన్, బాబుముండే, రాందాస్, రాంనివాస్, వసంత్రావ్, మెస్రం తుకారాం, సుంగుపటేల్, రాంషావ్, మహేశ్కదం,నగేశ్, పోటే సాయినాథ్, సుంకట్రావ్, భీంరావ్ పాల్గొన్నారు.