తుర్కపల్లి ఎంపీపీ సుశీల
తుర్కపల్లి,నవంబర్15 : రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలని ఎంపీపీ భూక్యా సుశీలారవీందర్ అన్నారు. మండల కేంద్రంతోపాటు వాసాలమర్రి, వీరారెడ్డిపల్లి, గంధమల్ల, పెద్దతండాలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని, ప్రభుత్వం ధాన్యానికి మద్దతు ధర కల్పిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ సింగిరెడ్డి నరసింహారెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పిన్నపురెడ్డి నరేందర్రెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు పలుగుల నవీన్కుమార్, సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు పోగుల ఆంజనేయులు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు పత్తిపాటి మంజుల, కో ఆప్షన్ సభ్యుడు రహమత్ షరీప్, సర్పంచ్ రామ్మోహన్శర్మ, ఏఓ దుర్గేశ్వరి, పీఏసీఎస్ డైరెక్టర్లు ముత్యాలు, చంద్రమౌళి, టీఆర్ఎస్ అధికార ప్రతినిధి తలారి శ్రీనివాస్, నాయకులు చాడ కరుణాకర్రెడ్డి, శ్రీకాంత్, జాలిగాం కృష్ణ, సర్వర్పాషా పాల్గొన్నారు.
నాణ్యమైన ధాన్యం తేవాలి
యాదగిరిగుట్ట రూరల్ : మండలంలోని సాధువెళ్లి గ్రామంలో అజీవ మహిళా రైతు ఉత్పత్తిదారుల కంపెనీ లిమిటెడ్ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీపీ చీర శ్రీశైలం, జడ్పీటీసీ తోటకూరి అనూరాధ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు నాణ్యమైన ధాన్యం తీసుకొచ్చి మద్దతు ధర పొందాలని సూచించారు. సర్పంచ్ సత్యలక్ష్మి, ఎంపీటీసీ సురేశ్, సీఈఓ శ్రీనివాస్ పాల్గొన్నారు.
మోటకొండూరులో..
మోటకొండూర్ : రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలని ఏఓ సుజాత సూచించారు. సోమవారం మండల కేంద్రంలోని సబ్ మార్కెట్ యార్డులో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా ధాన్యంలో తేమ శాతాన్ని పరిశీలించారు. కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించి గిట్టుబాటు ధర పొందాలని సూచించారు. కార్యక్రమంలో ఏఈఓలు ప్రణయ్రెడ్డి, రమేశ్, సంధ్య, రైతులు పాల్గొన్నారు.