ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి
ఆలేరు రూరల్/రాజాపేట, నవంబర్15 : రైతు సంక్షేమానికే రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. సోమవారం ఆలేరు మండలంలోని కొలనుపాకలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో, రాజాపేట మండలం సోమారంలో రేణికుంట వ్యవసాయ పరపతి సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వ్యవసాయం, అనుబంధ రంగాల అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ రైతుల సంక్షేమానికి అనేక పథకాలు అమలు చేస్తూ రైతు పక్షపాతిగా నిలుస్తున్నట్లు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు చేయకున్నా.. వానకాలం సీజన్కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు చేసేందుకు పల్లెపల్లెనా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. రైతులు దళారులను నమ్మి మోసపోకుండా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించి గిట్టుబాటు ధర పొందాలని సూచించారు. కార్యక్రమాల్లో ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డమీది రవీందర్గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ మొగులగాని మల్లేశ్గౌడ్, ఏఓ పద్మజ, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గంగుల శ్రీనివాస్, సర్పంచ్ ఆరుట్ల లక్ష్మీప్రసాద్రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గ్యాదపాక నాగరాజు, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు బక్క రాంప్రసాద్, పీఏసీఎస్ డైరెక్టర్లు అరె మల్లేశ్, మారుపల్లి భిక్షపతి, గవ్వల నర్సింహులు, బీసు కృష్ణంరాజు, టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు జంగ స్వామి పాల్గొన్నారు. సోమారంలో జరిగిన కార్యక్రమంలో జడ్పీటీసీ చామకూర గోపాల్గౌడ్, ఎంపీపీ గోపగాని బాలమణీయాదగిరిగౌడ్, సీసీ బ్యాంక్ చైర్మన్ చింతలపూరి భాస్కర్రెడ్డి, టీఆర్ఎస్ మహిళా విభాగం అధ్యక్షురాలు ఎడ్ల బాలలక్ష్మి, డైరెక్టర్లు గుంటి కృష్ణ, చింతలపూరి వెంకట్రామిరెడ్డి, ప్రభాకర్రెడ్డి, సీసీ బ్యాంక్ సీఈఓ శేఖర్, సర్పంచులు పెరుమాండ్ల కిషన్, గుంటి మధసూదన్రెడ్డి, ఉపసర్పంచ్ జంపయ్య, టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ సందిల భాస్కర్గౌడ్, టీఆర్ఎస్వై అధ్యక్షుడు సంతోశ్గౌడ్ పాల్గొన్నారు.