దేవరకొండ, డిసెంబర్ 13 : ముఖ్యమంత్రి సహాయ నిధితో పేదలకు ఆర్థిక భరోసా లభిస్తుందని ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. దేవరకొండ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలో 97 మంది లబ్ధిదారులకు రూ.45 లక్షల విలువైన సీఎం సహాయ నిధి చెక్కులను అందించారు. అదేవిధంగా కొండమల్లేపల్లి మండలకేంద్రంలో నిర్వహించిన అయప్ప మహాపడి పూజలో ఎమ్మెల్యే రవీంద్రకుమార్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఎమ్మెల్యేను మాలధారులు శాలువాతో సత్కరించారు. కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నర్సింహ, ఎంపీపీ నల్లగాసు జాన్యాదవ్, జడ్పీటీసీ మారుపాకుల అరుణాసురేశ్గౌడ్, వైస్ ఎంపీపీ చింతపల్లి సుభాశ్గౌడ్, రైతు బంధు సమితి మండలాధ్యక్షులు శిరందాసు కృష్ణయ్య, కేసాని లింగారెడ్డి, సర్పంచుల ఫోరం కొండమల్లేపల్లి మండలాధ్యక్షుడు కుంభం శ్రీనివాస్గౌడ్, టీఆర్ఎస్ కొండమల్లేపల్లి మండలాధ్యక్షుడు రమావత్ దస్రూనాయక్, పాల్గొన్నారు.
దేవరకొండరూరల్ : పెంచికల్పహాడ్ ఆంజనేయ ఆలయంలో ఎమ్మెల్యే రవీంద్రకుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు టీవీఎన్రెడ్డి, శ్రీనివాస్, మోహన కృష్ణ, పరిపూర్ణాచారి, పాల్గొన్నారు.
కాల్వలకు మరమ్మతు పనులు చేపట్టాలి
చందంపేట : డిండి ప్రాజెక్టు నీటి ద్వారా చందంపేట, నేరేడుగొమ్ము మండలాలకు వచ్చే కాల్వలను త్వరగా మరమ్మతులు చేపట్టాలని ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ నీటిపారుదల అధికారులకు ఆదేశించారు. మండలంలోని పోలేపల్లి గ్రామ సమీపంలో పలు చెరువులను పరిశీలించి డిండి ప్రాజెక్టు ద్వారా వచ్చే కాల్వలను అధికారులతో కలిసి పరిశీలించారు. ఆయన వెంట జడ్పీటీసీ రమావత్ పవిత్ర, దేవరకొండ రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు శిరందాసు కృష్ణయ్య, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ముత్యాల సర్వయ్య, మాజీ జడ్పీటీసీ బోయపల్లి శ్రీనివాస్ గౌడ్, డీఈఈ మనోహర్, ఏఈఈ ప్రియాంక, ఫయాజ్, బొడ్డుపల్లి కృష్ణ, మోహన్ ఉన్నారు.
సీసీ రోడ్డు నిర్మించాలని వినతి
డిండి: మండల కేంద్రంలోని అంగడి బజార్లో సీసీరోడ్డు నిర్మాణం చేపట్టాలని కోరుతూ అంగడి బజార్ అసోసియేషన్ సభ్యులు క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేకు వినతి పత్రం సమర్పించారు. ఎంపీటీసీ వెంకటయ్య, అంగడి బజార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎలకుర్తి రమేశ్, కాశన్న, శ్రీనివాస్గౌడ్, కలీం, రవిచౌహాన్, లక్ష్మీనారాయణ, వెంకటేశ్ పాల్గొన్నారు.