అర్హులందరూ టీకా వేసుకోవాలి
మంచిర్యాల కలెక్టర్ భారతీ హోళికేరి
మంచిర్యాల అర్బన్, డిసెంబర్ 13 : రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకుంటేనే కరోనాను ఎదుర్కోవచ్చని, అర్హులందరూ టీకా వేసుకోవాలని మంచిర్యాల కలెక్టర్ భారతీ హోళికేరి అన్నారు. సోమవారం ఐబీలోని వాగ్దేవీ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన మెగా వ్యాక్సినేషన్ కేంద్రాన్ని సందర్శించారు. కొవిడ్ వ్యాక్సిన్ ఆవశ్యకతపై అవగాహన కల్పించారు.కొవిడ్ టీకా వేసుకునేందుకు కొంతమంది ఇప్పటికీ ముందుకు రావడం లేదని తెలిపారు. 18 సంవత్సరాల వయస్సు నిండిన విద్యార్థులంతా వ్యాక్సిన్ వేసుకోవడంతో పాటు ఇతరులకు అవగాహన కల్పించాలని సూచించారు. అనంతరం విద్యార్థులకు దగ్గరుండి టీకా వేయించారు. వైద్య సిబ్బందితో మాట్లాడి కళాశాలల్లో వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తయ్యేటట్లు చూ డాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎం అం డ్ హెచ్వో ఫయాజ్ ఖాన్, కళాశాల కరస్పాండెంట్ పెట్టం మల్లేశ్, శ్రీకర్, అధ్యాపకులు, తదితరులున్నారు.
అర్హులందరూ టీకా వేసుకోవాలి
అర్హులందరూ వ్యాక్సిన్ వేసుకోవాలని మంచిర్యాల అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ సూచించారు. సోమవారం మిమ్స్ డిగ్రీ, పీజీ కళాశాలలో ఏర్పాటు చేసిన కొవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాన్ని పరిశీలించారు. వ్యాక్సినేషన్ ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు. 185 మంది విద్యార్థులు వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ శ్రీనివాస రాజు, ప్రిన్సిపాల్ ఉపేందర్ రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ శ్రీధర్ రావు, డైరెక్టర్ విజయ్ కుమార్, అధ్యాపకులు, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.