జిల్లా వ్యాప్తంగా వివేకానంద జయంతి
నివాళులర్పించిన ప్రజాప్రతినిధులు, యువజనసంఘాలు, నేతలు
వివేకానంద జీవితం ఆదర్శమని, నేటి తరానికి స్ఫూర్తి అని ప్రజాప్రతినిధులు, నాయకులు అన్నారు. స్వామి వివేకానందుడి జయంతిని బుధవారం జిల్లా వ్యాప్తంగా వివిధ పార్టీల నాయకులు, యువజన సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వివేకానందుడి విగ్రహాలకు, చిత్రపటాలకు పూలమాలలేసి నివాళి అర్పించారు. ఆయన జీవిత చరిత్రను గుర్తు చేశారు. జిల్లె డు చౌదరిగూడ మండలం పద్మారం గ్రామంలో ఏర్పాటు చేసిన వివేకానందుడి విగ్రహాన్ని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ ఆవిష్కరించారు.
ఇబ్రహీంపట్నం/ఇబ్రహీంపట్నం రూరల్, జనవరి 12 : ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో యువజన దినోత్సవాన్ని పురస్కరించుకుని వివిధ పార్టీల నాయకులు, యువజన సంఘాల నాయకులు, విద్యార్థులు గ్రామగ్రామాన స్వామి వివేకానంద విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, అబ్దుల్లాపూర్మెట్ మండలాలతో పాటు ఇబ్ర హీంపట్నం, తుర్కయాంజాల్, పెద్దఅంబర్పేట, ఆదిబట్ల మున్సిపాలిటీల్లో యువజన దినోత్సవాలను నిర్వహించారు.
యువత వివేకానందుని అడుగుజాడల్లో నడవాలి
కడ్తాల్ : యువత వివేకానందుని జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని ఎస్ఐ హరిశంకర్గౌడ్, వివేకానంద యువజన సంఘం వ్యవస్థాపకుడు రాఘవేందర్ అన్నారు. మండల కేంద్రంలో వివేకానంద యువజన సంఘం ఆధ్వర్యంలో వివేకానంద జయంతి నిర్వహించారు. అనంతరం కడ్తాల్-అన్మాస్పల్లి చౌరస్తాలో వివేకానంద యువజన సంఘం సభ్యులు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ శ్రీనివాస్రెడ్డి, నాయకులు నర్సింహ, జహంగీర్బాబా, వెంకటేశ్, దాసు, అసిఫ్అలీ, మాధవులు, యాదయ్య, రాజేశ్, రాజేందర్గౌడ్, ఇక్బాల్, రవి, కృష్ణ పాల్గొన్నారు.
వివిధ గ్రామాల్లో..
మంచాల : టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆరుట్ల గ్రామంలో స్వామి వివేకానంద జయంతి నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అదేవిధంగా వివిధ పార్టీల ఆధ్వర్యంలో జయంతిని నిర్వహించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చీరాల రమేశ్, పార్టీ గ్రామ అధ్యక్ష, కార్యదర్శులు పున్నం రాము, మహేందర్, ఎంపీటీసీ కావలి శ్రీనివాస్, ఉపసర్పంచ్ జంగయ్య, నాయకులు నూతనగంటి శేఖర్, ఎండీ జానీపాషా పాల్గొన్నారు.
మండల కేంద్రంలో..
యాచారం : స్వామి వివేకానందుడిని ఆదర్శంగా తీసుకుని యువకులు ముందుకు సాగాలని నాయకులు అన్నారు. వివేకానంద జయంతిని మండల కేంద్రంలో నిర్వహించారు. ఆయన జీవితం ఆదర్శమన్నారు. కార్యక్రమంలో బీజేవైఎం నాయకుడు నాగరాజు, బీజేపీ నాయకులు నక్క శ్రీనివాస్, రమేశ్, సంతోష్ పాల్గొన్నారు.
ఆదర్శంగా తీసుకోవాలి
ఆమనగల్లు : వివేకానంద జీవితాన్ని యువత ఆదర్శంగా తీసుకోవాలని నాయకులు అన్నారు. వివేకానంద చిత్రప టానికి ఎన్బీసీ మెంబర్ ఆచారి, ఏఎంసీ చైర్మన్ శ్రీనివా స్రెడ్డి,వైస్చైర్మన్ గిరియాదవ్, మున్సిపల్ చైర్మన్ రాంపాల్, వైస్ చైర్మన్ దుర్గయ్య పూలమాల వేసి నివాళులర్పించారు.
తలకొండపల్లి మండలంలో..
తలకొండపల్లి : పడకల్, వెల్జాల్, వెంకటాపూర్తో పాటు వివిధ గ్రామాల్లో వివేకానంద చిత్రపటానికి, విగ్రహాలకు పూలమాలలు వేశారు. మండల కేంద్రంలో జాతీయ బీసీ కమిషన్ సభ్యులు ఆచారి పాల్గొన్నారు. కార్యక్రమంలో శ్రీనివాస్యాదవ్, ఎంపీటీసీ హేమ, అంబాజి, యాదగిరి, వెంకటేశ్, విజయ్, పాండు పాల్గొన్నారు.
షాబాద్ మండలంలో..
షాబాద్ : మండల పరిధిలోని కుమ్మరిగూడ, షాబాద్, బోడంపహాడ్, మన్మర్రి, తాళ్లపల్లి తదితర గ్రామాల్లో వివేకానందుడి విగ్రహాలకు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల యువకులు, యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మండలంలోని కక్కులూర్లో వివేకానంద యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని బుధవారం ఆవిష్కరించారు. కార్యక్రమంలో సర్పంచ్ మమత, ధార్మిక వేత్త డా. భాస్కరయోగి, ఎంపీటీసీ కరుణాకర్, జీవన్రెడ్డి, మధుసూదన్రెడ్డి, కృష్ణగౌడ్, మురళీధర్రెడ్డి పాల్గొన్నారు.
శంకర్పల్లిలో ..
శంకర్పల్లి : శంకర్పల్లి మండల, మున్సిపల్ పరిధిలోని గ్రామాల్లో వివేకానంద జయంతిని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో నరేశ్కుమార్, హర్షవర్ధన్ నాయక్, గోపులారం సర్పంచ్ పొడవు శ్రీనివాస్ పాల్గొన్నారు.
కేశంపేట మండలంలో..
కేశంపేట : కేశంపేట, పాపిరెడ్డిగూడ, లింగంధన, కాకునూరు, కొత్తపేటలలో ప్రజాప్రతినిధులు, యువజన సంఘా ల నాయకులు వేడుకలను నిర్వహించారు. పాపిరెడ్డిగూడలో జడ్పీటీసీ తాండ్ర విశాల ఆధ్వర్యంలో వివేకానందుని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమాల్లో ఎస్ఐ వెంకటేశ్వర్లు, సర్పంచ్లు నవీన్కుమార్, వెంకట్రెడ్డి, లక్ష్మమ్మ, టీఆర్ఎస్ నాయకులు శ్రావణ్రెడ్డి, లక్ష్మీనారాయణ, యువజన సంఘాల నాయకులు పాల్గొన్నారు.
ఘనంగా జాతీయ యువజన దినోత్సవం
చేవెళ్ల రూరల్ : స్వామి వివేకానంద జీవితం నేటి యువతకు ఆదర్శమని దేవరంపల్లి సర్పంచ్ నరహరిరెడ్డి, దేవుని ఎర్రవల్లి సర్పంచ్ సామ మాణిక్యరెడ్డి, ముడిమ్యాల సర్పంచ్ శేరి స్వర్ణలతాదర్శన్ అన్నారు. బుధవారం ఆయా గ్రామాల్లో స్వామి వివేకానంద జయంతి వేడుకలను నిర్వహించారు. కార్యక్రమంలో మహ్మద్ ఫయాజ్, ఆనంద్, బుచ్చిరెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, హన్మంత్ రెడ్డి, భుజంగరెడ్డి, మధుసూదన్ రెడ్డి, మాధవరెడ్డి పాల్గొన్నారు.
కొత్తూరు మండలంలో..
కొత్తూరురూరల్ : శేరిగూడబద్రాయపల్లి సర్పంచ్ అంబటి ప్రభాకర్, టీఆర్ఎస్ యూత్ మండల ప్రెసిడెంట్ కడల శ్రీశై లం ఆధ్వర్యంలో వివేకానందుడికి నివాళి అర్పించారు. పెం జర్ల, శేరిగూడబద్రాయపల్లి, కొడిచర్ల, గూడూరు గ్రామా ల్లో యువజన సంఘాల ఆధ్వర్యంలో జయంతి నిర్వహించారు.