న్యాయ సేవాధికార సంస్థ ద్వారా అందించాలి
చట్టాలు, హకులపై అవగాహన కల్పించాలి
రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ మెంబర్ సెక్రటరీ వై రేణుక
కరీంనగర్ నుంచి ఉమ్మడి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీసీ
కరీంనగర్, నవంబర్ 11(నమస్తే తెలంగాణ): జిల్లాల న్యాయ సేవాధికార సంస్థల ద్వారా పేద ప్రజలకు ఉచిత న్యాయ సేవలు అందించాలని, చట్టాలు, హకులపై అవగాహన కల్పించాలని రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ యార రేణుక అధికారులను ఆదేశించారు. గురువారం కరీంనగర్ కలెక్టరేట్ నుంచి పెద్దపెల్లి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల కలెక్టర్లు, పోలీస్ కమిషనర్, ఎస్పీలతో వీసీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు పూర్తయిన సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవాలు జరుపుకుంటున్నామన్నారు. ఇందులో భాగంగా జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో హకులు, చట్టాలు, ఉచిత న్యాయ సేవలపై దేశవ్యాప్తంగా మొదలుకొని గ్రామ స్థాయి దాకా అక్టోబర్ 2 నుంచి నవంబర్ 14 దాకా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఏ వ్యక్తిపైన అయినా నేరం ఆరోపించబడినపుడు శిక్ష పడకుండా కోర్టులో న్యాయవాదిని నియమించుకోవాల్సి ఉంటుందని చెప్పారు. చాలా మందికి ఆర్థిక స్థోమత లేకపోవడంతో అప్పు చేసి న్యాయవాదిని ఏర్పాటు చేసుకుంటున్నారని తెలిపారు. ఉచిత న్యాయ సాయం గురించి అవగాహన లేకపోవడం, తెలియక పోవడం వల్లే ఆర్థిక భారం పడుతుందని, క్రిమినల్, సివిల్ కేసుల్లో కూడా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా న్యాయవాది ఫీజు చెల్లించి ఉచిత న్యాయ సాయం అందిస్తామని చెప్పారు.
జిల్లా కలెక్టర్ కార్యాలయం, పోలీస్, పోస్టాఫీస్ ఇతర కార్యాలయాలు ప్రజలకు ఎలా తెలుసో.. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, మండల న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయాలు..సేవల గురించి తెలియజేయాల్సిన అవసరం ఉందని వివరించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఏర్పాటు జరిగి 25 ఏండ్లు పూర్తయిందన్నారు. రూ. 3లక్షల కంటే వార్షిక ఆదాయం తకువ ఉన్న వారికి మహిళలు, పిల్లలందరికీ అసంఘటిత రంగంలో కార్మికులకు బలహీన వర్గాలకు ఉచిత న్యాయ సేవలు అందిస్తామన్నారు. ఉచిత న్యాయ సేవలు, మెగా క్యాంపులు, వివిధ కేసుల్లో బాధితులకు అందిస్తున్న పరిహారం, తదితర సేవలను ఊరూరా విస్తృతంగా అవగాహన కల్పించాలని, గ్రామాల్లో దండోరా వేయించాలని సూచించారు. గ్యాంగ్ రేప్ బాధితురాలికి, హత్యకు గురైన వ్యక్తిపై ఆధారపడిన వారికి ప్రభుత్వం తరపున 5 లక్షల నుంచి 10 లక్షలు, యాసిడ్ బాధితులకు 7 లక్షల నుంచి 8 లక్షలు, అంగ వైకల్యం సంభవిస్తే లక్ష నుంచి 2లక్షలు పరిహారం ప్రభుత్వం అందిస్తుందని, చాలా మంది పరిహారం పొందలేకపోతున్నారని చెప్పారు. జిల్లా, మండల న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో దరఖాస్తు చేసుకుంటే పరిహారం అందించేందుకు సాయం చేస్తామని చెప్పారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా శిక్షణ ఇచ్చిన పారా లీగల్ వలంటీర్ల ద్వారా ఉచిత న్యాయ సేవలు గురించి అవగాహన కల్పిస్తున్నామని, అధికారులు, ప్రజా ప్రతినిధులు కూడా సహకారం అందించాలని సూచించారు.
కలెక్టర్ ఆర్వీ కర్ణన్ మాట్లాడుతూ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా అందిస్తున్న ఉచిత న్యాయ సహాయం, వివిధ శాఖల లబ్ధిదారులకు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు చేరే విధంగా సహకారం జిల్లా యంత్రాంగం అందిస్తుందని చెప్పారు. అన్ని ప్రభుత్వ ముఖ్య కార్యాలయాల్లో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యక్రమాలు, ఫోన్ నంబర్లు ఫ్లెక్సీలు, బోర్డుల ఏర్పాటుకు చర్య లు తీసుకుంటామని వివరించారు. సీపీ సత్యనారాయణ మాట్లాడుతూ అర్హులైన వారికి న్యాయ సేవలందినపుడే సార్థకత ఉంటుందన్నారు. అనంతరం పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. ఇక్కడ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బీ సుజయ్ కుమార్, అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్లాల్, డీసీపీ శ్రీనివాస్, ఎసీపీ మదన్లాల్, మున్సిపల్ కమిషనర్ యాదగిరి రావు, డీఎంహెచ్వో జువేరియా,అధికారులు ఉన్నారు.