పరిగి ఎమ్మెల్యే మహేశ్రెడ్డి
పూడూరు , జనవరి 11: తెలంగాణ ప్రభుత్వం వచ్చాక పరిగి నియోజక వర్గంలో 1000 మంది రైతులకు రైతు బీమా డబ్బులు అందాయని, పూడూరు మండలం లోనే 150 మందికి రైతు బీమా డబ్బు లు నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో జమ అయ్యాయని పరిగి ఎమ్మెల్యే మహేశ్రెడ్డి తెలిపారు. పూడూరు మండల సర్వసభ్య సమావేశం మంగళవారం ఎంపీపీ మల్లేశం అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలన్నారు. అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. గ్రామాల్లోని అత్యవసర పనులను గుర్తించి నిధుల అంచనాలు వేసి నివేదిక ఇవ్వాలని విద్యుత్ శాఖ ఏఈ ఆదేశించారు. మార్చి వరకు విద్యుత్ సమస్యలు లేకుండా ఉండేలా నిధులను మం జూరు చేయిస్తానన్నారు. గ్రామాల్లో తాగు నీటి సమస్య రాకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ మేఘ మాల, వైస్ఎంపీపీ మహిపాల్రెడ్డి, ఎంపీటీసీ లక్ష్మణ్, సురేందర్, ఎంపీడీవో ఉమాదేవి ఆయా గ్రామాల సర్పంచ్లు ఎంపీటీసీలు, అధికారులు పాల్గొన్నారు.
రూ.2లక్షలు ఎల్వోసీ అందజేత
పరిగి, జనవరి 11: దోమ మండలం పాలేపల్లి గ్రామానికి చెందిన కండెవోని లక్ష్మీ నరాల బలహీనతతో హైదరాబాద్లోని నిమ్స్లో చికిత్స పొందుతుండగా, చికిత్స నిమిత్తం రూ.2లక్షలు ఎల్వోసీ ఎమ్మెల్యే మహేశ్రెడ్డి మంజూరు చేయించారు. ఈ మేరకు మంగళవారం పరిగిలో ఎల్వోసీ కాపీని ఆమె కుటుంబసభ్యులకు ఎమ్మె ల్యే అందజేశారు. కార్యక్రమంలో దోమ జెడ్పీటీసీ కొప్పుల నాగారెడ్డి, మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు గోపాల్గౌడ్ పాల్గొన్నారు.