మండలాల్లో ఎడ్లబండ్లు, ట్రాక్టర్లతో ర్యాలీలు
పాల్గొన్న ఎమ్మెల్యేలు యాదయ్య, అంజయ్యయాదవ్, ఇతర ప్రజాప్రతినిధులు
షాబాద్, జనవరి 10: రాష్ట్రంలో రైతును రాజు చేయాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, జడ్పీటీసీ పట్నం అవినాశ్రెడ్డి అన్నారు. సోమవారం రైతుబంధు వారోత్సవాల్లో భాగంగా జడ్పీటీసీ అవినాశ్రెడ్డి ఆధ్వర్యంలో షాబాద్ మండలంలోని కక్కులూర్ రైతువేదిక వద్ద సంబురాలు పెద్ద ఎత్తున నిర్వహించారు. షాబాద్ నుంచి కక్కులూర్ రైతువేదిక వరకు ట్రాక్టర్ల ర్యాలీ, ఎండ్ల బండ్ల ర్యాలీలో ఎమ్మెల్యే, జడ్పీటీసీ పాల్గొన్నారు. అనంతరం సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కార్యకర్తలతో కలిసి ఉత్సాహంగా డ్యాన్సులు చేశారు. రైతుబంధు, రైతుబీమా పథకాలతో అన్నదాతలకు అండగా నిలుస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ చరిత్రలో నిలిచిపోతారని తెలిపారు. సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ప్రభుత్వంపై విమర్శలు చేస్తే ప్రతిపక్షాలకు గుణపాఠం తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎంపీపీ కోట్ల ప్రశాంతిరెడ్డి, వైస్ ఎంపీపీ జడల లక్ష్మి, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ స్వప్నారెడ్డి, మాజీ చైర్మన్ శ్రీనివాస్గౌడ్, రైతుబంధు సమితి సభ్యుడు ప్రభాకర్రెడ్డి, మండల కన్వీనర్ మధుసూదన్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ చల్లా శేఖర్రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నర్సింగ్రావు, కో ఆప్షన్ సభ్యుడు ఎండీ చాంద్పాషా, కక్కులూర్ సర్పంచ్ భానూరి మమత, ఎంపీటీసీ కరుణాకర్, వ్యవసాయాధికారులు, నాయకులు పాల్గొన్నారు.
అంబరాన్నంటిన రైతుబంధు సంబురాలు
షాద్నగర్ : తెలంగాణ అంటే రైతుల రాష్ట్రం అనే రీతిలో సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ పరిపాలన కొనసాగుతున్నదని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ అన్నారు. పట్టణంలో రైతు బంధు సంబురాల్లో భాగంగా రైతులు నిర్వహించిన ట్రాక్టర్ ర్యాలీని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. రానున్న రోజుల్లో రైతులకు మరింత మంచి జరిగే పథకాలు వస్తాయని తెలిపారు. పట్టణంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం నుంచి వ్యవసాయ మార్కెట్ యార్డు వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్, జడ్పీటీసీ వెంకట్రాంరెడ్డి, ఎంపీపీ ఖాజ ఇద్రీస్, మార్కెట్ కమిటీ చైర్మన్ మన్నె కవిత, మున్సిపల్ చైర్మన్ నరేందర్, వైస్ చైర్మన్ నటరాజన్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నారాయణరెడ్డి, ఏడీఏ రాజారత్నం పాల్గొన్నారు.
రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
నందిగామ : రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. నందిగామ మండల కేంద్రంలో సర్పంచ్ జిల్లెల్ల వెంకట్రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన రైతుబంధు సంబురాల్లో ముఖ్యఅతిథిగా జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్తో కలిసి ఎమ్మెల్యే పాల్గొన్నారు. వారికి మహిళలు హారతులతో ఘనస్వాగతం పలికారు. నందిగామలోని అంబేద్కర్, గాంధీ విగ్రహాలకు ఎమ్మెల్యే నివాళులర్పించారు. అనంతరం ఎడ్ల బండ్లు, ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించా రు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ మంజుల, పీఏసీఎస్ చైర్మన్న్లు మంజులరెడ్డి, అశోక్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నారాయణరెడ్డి, మాజీ ఎంపీపీ శివశంకర్గౌడ్, మాజీ చైర్మన్ విఠల్, సర్పంచ్లు గోవిందు అశోక్, కుమార్, రమేశ్, రాజు, స్వామి, చంద్రారెడ్డి, ఉపసర్పంచ్ కుమార్ పాల్గొన్నారు.
కొత్తూరు/ కొత్తూరు రూరల్ : రైతుబంధు వారోత్సవాల సందర్భంగా కొత్తూరు మండలంలో మండల వ్యవసాయశాఖ అధికారి గోపాల్ ఆధ్వర్యంలో రైతుబంధు సంబురాలను నిర్వహించారు. వివిధ గ్రామాల నుంచి రైతులు ట్రాక్టర్లు, బైకులపై మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం వరకు నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే వై.అంజయ్యయాదవ్ హాజరై ట్రాక్టర్ నడిపించి ర్యాలీని ప్రారంభించారు. కార్యక్రమంలో ఏడీఏ రాజారత్నం, ఎంపీపీ మధుసూదన్రెడ్డి, జడ్పీటీసీ శ్రీలత, వైస్ ఎంపీపీ శోభ, ఇన్చార్జి ఎంపీడీవో బాల్రెడ్డి, సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
రైతు బాంధవుడు సీఎం కేసీఆర్
కేశంపేట : సీఎం కేసీఆర్ రైతు బాంధవుడని ఎంపీపీ వై.రవీందర్యాదవ్ అన్నా రు. మండల కేంద్రంలో 60 ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించి రైతుబంధు సంబురాల్లో పాల్గొన్నారు. అన్నదాత సంక్షేమం కోసం విశేషంగా కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ను ప్రతిపక్షాలు అడ్డ గోలుగా మాట్లాడటం రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని, రాబో యే రోజుల్లో ప్రజలు వారికి తగిన గుణపాఠం చెబుతారన్నా రు. అనంతరం మండలంలో ఉత్తమంగా వ్యవసాయం సాగిస్తున్న రైతులను సన్మానించారు. జడ్పీటీసీ తాండ్ర విశాల, వైస్ ఎంపీపీ అనురాధ, మండల కోఆప్షన్ మెంబర్ జమాల్ఖాన్, మార్కెట్ వైస్చైర్మన్ నారాయణరెడ్డి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ అంజిరెడ్డి, ఏవో శిరీష, సర్పంచ్లు నవీన్కుమార్, వెంకట్రెడ్డి, కృష్ణయ్య, ఎంపీటీసీలు మల్లేశ్యాదవ్, యాదయ్యచారి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మురళీధర్రెడ్డి, నాయకులు యాదగిరిరావు, ప్రభాకర్రెడ్డి, పల్లె శ్రావణ్రెడ్డి, పర్వత్రెడ్డి, లక్ష్మణ్నాయక్, మురళీమోహన్ పాల్గొన్నారు.
ఆత్మగౌరవంతో బతకాలని రైతుబంధు
మొయినాబాద్ : రాష్ట్రంలో రైతులు ఆత్మగౌరవంతో బతకాలనే గొప్ప సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టి పంటపెట్టుబడి సాయం అందిస్తున్నదని ఎంపీపీ గునుగుర్తి నక్షత్రం, జడ్పీటీసీ కాలె శ్రీకాంత్ అన్నారు. మండల కేంద్రంలోని సురంగల్-మొయినాబాద్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం వద్ద పీఏసీఎస్ చైర్మన్ మందడి చంద్రారెడ్డి సహకారంతో మండల వ్యవసాయ అధికారి ఎన్ రాగమ్మ రైతుబంధు సంబురాలు ఘనంగా నిర్వహించారు. ముగ్గులు వేసి సంబురాలు నిర్వహించారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ ఎం మమత, ఏఎంసీ వైస్ చైర్మన్ డప్పు రాజు, పీఏసీఎస్ వైస్ చైర్మన్ మహేందర్, పీఏసీఎస్ మాజీ చైర్మన్ జగన్మోహన్రెడ్డి, ఈఏవోలు కుమార్, సునీల్, పీఏసీఎస్ డైరెక్టర్లు శ్రీనివాస్, వెంకటేశ్, భూపాల్రెడ్డి, నర్సింహారెడ్డి పాల్గొన్నారు.
సహకార సంఘం కార్యాలయంలో..
యాచారం: మండల కేంద్రంలోని సహకార సంఘం కా ర్యాలయంలో రైతుబంధు వారోత్సవాలను పీఏసీఎస్ చైర్మన్ రాజేందర్రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. తెలంగాణ రైతుబంధు, 50 వేల కోట్లు విడుదల, జై కేసీఆర్ అని డైరెక్టర్లు శశికళ, స్వరూపలు ముగ్గుల రూపంలో ప్రదర్శించారు.కార్యక్రమంలో రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు జోగిరెడ్డి, వ్యవసాయ అధికారి సందీప్, సర్పంచ్ కృష్ణ ఉన్నారు.
అన్నదాతల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
కడ్తాల్ :అన్నదాతల సంక్షేమమే ధ్యేయంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తున్నదని జడ్పీటీసీ దశరథ్నాయక్, డీసీసీబీ డైరెక్టర్ వెంకటేశ్గుప్తా అన్నారు. మండల పరిధిలోని రావిచేడ్ గ్రామంలోని రైతు వేదిక ఆవరణలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్ భారతమ్మ, ఎంపీటీసీ గోపాల్, టీఆర్ఎస్ మండల, గ్రామాధ్యక్షులు పరమేశ్, రమేశ్యాదవ్, రైతుబంధు సమితి మండల, గ్రామ కోఆర్డినేటర్లు వీరయ్య, బాలకృష్ణ, ఏవో శ్రీలత, ఏఈవోలు రమణ, వార్డు సభ్యులు ఇందిరమ్మ, రవి, అలివేలు, ప్రమీల, రమాదేవి, నాయకులు జితేందర్రెడ్డి, జమీర్, శ్రీశైలం, కృష్ణయ్య పాల్గొన్నారు.