ఘట్కేసర్ చైర్పర్సన్ ఎం.పావనీ జంగయ్య యాదవ్
ఘట్కేసర్,జనవరి 9 : ఓపెన్ జిమ్లను ఏర్పాటు చేసి ప్రభుత్వం ప్రజారోగ్యానికి కృషి చేస్తున్నదని ఘట్కేసర్ చైర్పర్సన్ ఎం.పావనీ జంగయ్య యాదవ్ తెలిపారు. ఘట్కేససర్లోని గురుకుల్లో ఓపెన్ జిమ్ ఏర్పాటుకు ఆమె ఆదివారం స్థలాన్ని పరిశీలించారు. స్థానిక వాకింగ్ అసోసియేషన్, బాలాజీనగర్ యూత్ అసోసియేషన్ల విజ్ఞప్తి మేరకు స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మున్సిపాలిటీ పాలకవర్గం తీర్మానం చేసి గురుకుల్ ఖాళీ స్థలంలో అందరికి ఉపయోగపడే విధంగా ఓపెన్ జిమ్, వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తామని చైర్పర్సన్ వివరించారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ వ్యాయామం చేస్తున్నారని తెలిపారు. మంత్రి మల్లారెడ్డితో మాట్లాడి ఓపెన్ జిమ్ పై నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. అనంతరం పక్కనే ఉన్న యాదాద్రి పార్కులో మొక్కలను పరిశీలించారు. మున్సిపాలిటీ టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి బి.రాధాక్రిష్ణ ముదిరాజ్, నాయకులు ఎం.జంగయ్య యాదవ్, ఎస్.శ్రీనివాస్ గౌడ్, కె.ఈశ్వర్, సురేశ్, మున్నాబాయ్, రాజు, నాగేశ్వరావు, మేఘనాథ్రెడ్డి పాల్గొన్నారు.