శంషాబాద్ : శంషాబాద్ ఎయిర్పోర్టులో సూడాన్ దేశస్థురాలి వద్ద 1.2 కేజీల అక్రమ బంగారంను కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. ఈ ఘటన మంగళవారం చోటుచేసుకుంది. కస్టమ్స్ అధికారుల వివరాల ప్రకారం…సూడాన్ దేశానికి చెందిన ఓ ప్రయాణీకురాలు వయా దుబాయ్ మీదుగా సూడాన్ నుంచి ఇకె 524 విమానంలో వచ్చింది.
శంషాబాద్ ఎయిర్పోర్టులో ఆమె దిగిన అనంతరం కస్టమ్స్ విభాగం ఆమెపై నిఘా పెట్టింది. తనిఖీలో ఆమె లోదుస్తులల, చేతి బ్యాగ్లో అక్రమ బంగారం ఉన్నట్లు గుర్తించారు. ఈ మేరకు బంగారం స్వాధీనం చేసకున్నారు. కస్టమ్స్ స్వాధీనం చేసుకున్న బంగారం 1209 గ్రాములు ఉంది. దీని విలువ రూ. 58.16 లక్షలు. ఈ మేరకు సూడాన్ దేశస్థురాలిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు పేర్కొన్నారు.