టీఆర్ఎస్ ప్రభుత్వ పాలన ఉంది
పోడు సమస్యలకు త్వరలోనే పరిష్కారం
మానుకోట ఎమ్మెల్యే శంకర్నాయక్
గూడూరు, డిసెంబర్ 8: పేదల అభివృద్ధి, సంక్షేమం కోసమే టీఆర్ఎస్ ప్రభుత్వ పాలన ఉందని మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్నాయక్ అన్నారు. ‘మన ఊరు.. మన ఎమ్మెల్యే’ కార్యక్రమం మండలంలో రెండోరోజు కోబల్తండా, మర్రిమిట్ట, లైన్తండా గ్రామాల్లో కొనసాగింది. సమస్యలు, కావాల్సిన సౌకర్యాలపై ఎమ్మెల్యే ప్రజలను అడిగి తెలుసుకున్నారు. కొన్ని సమస్యలను అక్కడికక్కడే అధికారులతో మాట్లాడి పరిష్కరించారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆయా గ్రామాల్లో మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. ప్రజల వద్దకే వచ్చి సమస్యలను పరిష్కరిస్తానని చెప్పారు. పోడు సమస్యల కోసం దరఖాస్తులు ఆహ్వానించామని, దీంతో రానున్న రోజుల్లో ఈ సమస్య పరిష్కారమవువుతుందని తెలిపారు. అర్హులైన పోడు రైతులకు రైతుబంధు, రైతుబీమా పథకాలు అమలు చేస్తామని చెప్పారు. గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రెయినేజీకి సీడీఎఫ్ నిధులు ఇస్తానని హామీ ఇచ్చారు. సొంత స్థలాలు ఉంటే దశలవారీగా డబుల్ బెడ్రూం ఇళ్లకు అనుమతులు ఇస్తామని, ఈ ప్రక్రియ రానున్న రెండు నెలల్లో పూర్తవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బానోత్ సుజాతా మోతీలాల్, ఎంపీడీవో విజయలక్ష్మీ, తహసీల్దార్ శైలజ, ఈవోఆర్డీ ప్రసాద్, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు ముక్కా లక్ష్మణ్రావు, సర్పంచ్లు మూడు కమల శ్రీనివాస్, సునీత ఎంపీటీసీలు కవితా భాస్కర్, వి.విజయ శ్రీహరి, టీఆర్ఎస్పార్టీ మండల అధ్యక్షుడు వేం వెంకటకృష్ణారెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం సంపత్రావు, ప్రధాన కార్యదర్శి నూకల సురేందర్, అధికార ప్రతినిధి నర్సింహనాయక్, ఉపాధ్యక్షుడు కోడి రవి, పెసరి శివ, నాగరాజు, ఎడ్ల రమేష్, శోభన్బాబు, జనార్థన్, శ్రీనివాస్, కిషన్, థావు పాల్గొన్నారు.