డీసీసీబీ చైర్మన్ గొంగడి మహేందర్రెడ్డి
చౌటుప్పల్ రూరల్, నవంబర్ 8 : బీజేపీ రైతు వ్యతిరేక ప్రభుత్వమని, రానున్న యాసంగిలో పంజాబ్ తరహాలో ఉద్యమాలు చేయాల్సి వస్తుందని డీసీసీబీ చైర్మన్, టెస్కాబ్ వైస్ చైర్మన్ గొంగడి మహేందర్రెడ్డి హెచ్చరించారు. సోమవారం మండలపరిధిలోని ఎల్లంబావి గ్రామంలో పీఏసీఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో డీసీసీబీ చైర్మన్ మాట్లాడుతూ ధాన్యం సాగులో పంజాబ్ రాష్ట్రం మొదటిది కాగా తెలంగాణ రెండోవదన్నారు. అక్కడ రైతులు ఉద్యమాలు చేస్తున్నారని భయపడి కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొంటుందని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ను ఇబ్బందులకు గురి చేసేందుకు తెలంగాణలో ధాన్యం కొనుగోలు చేస్తాలేదని మండిపడ్డారు. ధాన్యం కొనుగోళ్లలో కొన్ని పార్టీలు అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నాయన్నారు. గతేడాది 93లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చినప్పటికీ టీఆర్ఎస్ ప్రభుత్వం సేకరించిందని తెలిపారు. ప్రస్తుతం 1.73కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం రానున్నట్లు అధికారులు అంచన వేశారన్నారు. కేవలం కేంద్ర ప్రభుత్వం 60లక్షల మెట్రిక్ టన్నులు కొనేందుకు అనుమతి ఇచ్చిందని, అయినా పూర్తి స్థాయిలో కొనుగోళ్లు చేసేందుకు కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో కేవలం 21లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించేదని తెలిపారు.
ఎఫ్సీఐ నిర్లక్ష్యమే కారణం