మునుగోడు, డిసెంబర్ 7 : యాసంగి సీజన్లో వరికి బదులుగా ఇతర పంటలపై రైతులు దృష్టి సారించాలని ఏడీఏ ఎల్లయ్య సూచించారు. మండలంలోని కచలాపురం, గూడపూర్, కల్వలపల్లి గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంగళవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఇతర పంటల సాగుపై రైతులకు ఆయన అవగాహన కల్పించారు. ఆరుతడి పంటల సాగుతో రైతులు ఆర్థికంగా లాభపడతారని అన్నారు. కార్యక్రమంలో ఏఓ సర్ప ంచులు గురిజ అరుణ, కంచి జ్యోతి, ఎంపీటీసీ వంటెపాక వెంకటమ్మ, సూదగాని శ్రీనివాస్గౌడ్, ఏఈఓలు యాదగిరి, మౌనిక, నర్సింహ పాల్గొన్నారు.
కట్టంగూర్ : మండలంలోని మునుకుంట్ల, కట్టంగూర్, ఈదులూరు గ్రామాల్లో రైతులకు ఏఓ శ్రీనివాస్ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మిల్లు యాజమాన్యాలతో ముందస్తు ఒప్పందం ఉన్నవారు వరి వేసుకోవచ్చని స్పష్టం చేశారు. ఏఈఓలు పరశురాములు, మెజాయిద్నాయక్, రమణ పాల్గొన్నారు.
చిట్యాల : మండలంలోని ఆరెగూడెం, చిట్యాల, చిన్నకాపర్తి గ్రామాల్లో ఇతర పంటల సాగుపై ఏఓ గిరిబాబు రైతులకు అవగాహన కల్పించారు. యాసంగిలో వరి కొనుగోలు కేంద్రాలు ఉండవని పెసర, మినుములు, పొద్దుతిరుగుడు, నువ్వులు వంటి పంటలను సాగు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఏఈఓ శ్రీలేఖ, దేవేందర్ పాల్గొన్నారు.
కనగల్ : చినమా దారం, బుడుమర్లపల్లి, కనగల్, రేగట్టె, పర్వతగిరి,చర్లగౌరారం, దర్వేశిపురం గ్రామాల్లో ఏఓ బెజవాడ అమరేందర్గౌడ్ రైతులకు అవగాహన కల్పించారు. సదస్సుల్లో సర్పంచులు నర్సింగ్ సునీతా కృష్ణయ్యగౌడ్, అంజమ్మారామచంద్రు,నర్సిరెడ్డి, యాదగిరి, పార్వతమ్మ, జానయ్య ఏఈఓలు పాల్గొన్నారు.
నాంపల్లి : మండలంలోని దేవత్పల్లి, దామెర, రాందాస్తండా, మహ్మదాపురం, ఫకీర్పురం, రేఖ్యతండా, శర్బాపురం, వడ్డేపల్లి గ్రామాల్లో మండల విస్తరణ అధికారులు ఇతర పంట సాగుపై రైతులకు అవగాహన కల్పించారు. అనంతరం వ్యవసాయ క్యాలెండర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో సర్పంచ్ దామెర యాదగిరి, సురేందర్నాయక్, రమేశ్, అందుగుల కవిత, ఏఈఓలు నాంపల్లి సాయి, కవిత, అనూష, విజయ, గణేశ్ పాల్గొన్నారు.
దేవరకొండ రూరల్ : చింతబాయి గ్రామంలో ఏఈఓ జగన్ రైతులకు అవగాహన కల్పించారు. అనంతరం ఇతర పంటల సాగుపై అవగాహన కల్పించే కరపత్రాలు పంచారు. సర్పంచ్ నోముల మల్లేశ్ పాల్గొన్నారు.
డిండి : చెర్కుపల్లి, ఖానాపూర్, గోనబోయినపల్లి, ప్రతాప్ నగర్ గ్రామాల్లో వ్యవసాయాధికారులు రైతులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఏఈఓలు వెంకటేశ్, సాయితేజ, పరమేశ్వరి పాల్గొన్నారు.
పెద్దవూర: తుంగతుర్తిలోఇతర పంటల సాగుపై ఏఓ సందీప్కుమార్ రైతులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సర్పంచ్ మెండె విష్ణుప్రియాసైదులు, ఉప సర్పంచ్ వెంకట్రెడ్డి పాల్గొన్నారు.