బోనకల్లు, జూన్ 6: మధిర ప్రభుత్వ వైద్యశాలలో సెంట్రల్ ఆక్సిజన్ ప్లాంట్ను జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్రాజుతో కలిసి ఖమ్మం కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ఆదివారం ప్రారంభించారు. సత్యసాయి సేవా సమితి ఎన్ఆర్ఐ పేరెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మధిర ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు కోసం జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్రాజు సూచనల మేరకు దాతలు ముందుకొచ్చారు. ఆక్సిజన్ ప్లాంట్ను అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా వైరస్ కట్టడి కోసం ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు తోడుగా సత్యసాయి సేవా సమితి, ఎన్ఆర్ఐ పేరెంట్స్ అసోసియేషన్ నిర్వాహకులు కోనా మోహన్రావు అదించిన సహకారం అభినందనీయమన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఎక్కువగా పేదలే వైద్యసేవలు పొందుతారని, వారికి ఇలాంటి ప్లాంట్ను ఏర్పాటు చేయడం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ మాలతి, వైరా ఏసీపీ సత్యనారాయణ, మధిర తహసీల్దార్ సైదులు, ఎంపీడీవో విజయభాస్కర్రెడ్డి, ఎంపీపీ మెండెం లలిత, మున్సిపల్ చైర్పర్సన్ మొండితోక లత, డాక్టర్ అనిల్కుమార్, సత్యసాయి సేవా సమితి జిల్లా కన్వీనర్ సుధాకర్, సేవా దళ్ జిల్లా కన్వీనర్ భాస్కర్, వనమా సూరి, మురళి, టీఆర్ఎస్ నేతలు, అధికారులు పాల్గొన్నారు.