మాస్క్ ధరించని 12 మందికి జరిమానా
ప్లాస్టిక్ కవర్లు వినియోగిస్తున్న 13 షాపులకూ కూడా..
కుత్బుల్లాపూర్, డిసెంబర్ 4 : కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు ఒకవైపు ప్రజలను అప్రమత్తం చేస్తూనే.. మరో వైపు పర్యావరణ పరిరక్షణకు హానిగా ఉన్న ప్లాస్టిక్ను నిషేధించేందుకు కొంపల్లి మున్సిపల్ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. స్వచ్ఛసర్వేక్షణ్-22లో భాగంగా శనివారం కొంపల్లి మున్సిపల్ కమిషనర్ రఘు ఆధ్వర్యంలో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో కిరాణాషాపులో 75 మైక్రాన్ల కంటే తక్కువ సామార్థ్యం గల ప్లాస్టిక్ కవర్లను వినియోగిస్తున్న 13 షాపుల నిర్వా హకులకు జరిమానాతో పాటు మాస్కులు ధరించని 12మందికి జరిమా నాలు విధించారు. మాస్కులు ధరించని ఒక్కొక్కరికి సుమారు రూ.500 వరకు జరిమానా విధించారు. ప్రతి ఒక్కరూ బాధ్యతతో ఉండాలని, కరోనా మహమ్మారి నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ప్రభుత్వం విధించిన కొవిడ్ నిబంధనలు పాటించాలని, మాస్కులు లేని వారికి జరిమానా వేస్తామని ఆయన హెచ్చరించారు. అలాగే ఆయా దుకాణాల్లో నిబంధనలకు వ్యతిరేకంగా ప్లాస్టిక్ కవర్లను వాడితే షాపులను సీజ్ చేయాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.