చర్లపల్లి, డిసెంబర్ 4 : మాజీ గవర్నర్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కొణిజేటి రోశ య్య రాష్ర్టానికి చేసిన సేవలను ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకోవాలని వాసవి మిత్ర మండలి మేడ్చల్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పెద్ది నాగరాజు, శ్రీనివాస్గుప్తా, నాయకులు రామిణి తిరుమలేశ్, గంప కృష్ణ పేర్కొన్నారు. శనివారం రోశయ్య మృతి చెందగా.. ఏఎస్రావునగర్ డివిజన్, ఈసీఐఎల్ చౌరస్తాలో మేడ్చల్ జిల్లా వాసవి మిత్ర మండలి ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో వాసవి మిత్ర మండలి జిల్లా నాయకులు శ్రీధర్గుప్తా, నవీన్గుప్తా, ఉప్పల శ్రీనివాస్గుప్తా, అశోక్గుప్తా, తాటి శ్రీనివాస్గుప్తా, సంతోశ్గుప్తా, అరుణ్గుప్తా, రమేశ్గుప్తా, ప్రసాద్గుప్తా, నాగరాజుగుప్తా, అశోక్గుప్తా, శివగుప్తా, రామ్మోహన్గుప్తా, కిషోర్గుప్తా, నగేశ్గుప్తా, చంద్రగిరి తారకేశ్వర్గుప్తా, ముత్యాలు గుప్తా పాల్గొన్నారు.