ఎమ్మెల్యే దివాకర్రావు
శ్రీరాంపూర్లో బియ్యం, నిత్యావసర వస్తువుల పంపిణీ
హాజీపూర్ పీహెచ్సీ పరిశీలన
లక్షెట్టిపేట ప్రభుత్వ దవాఖానకు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ల అందజేత
శ్రీరాంపూర్, జూన్ 4 : కరోనా నేపథ్యంలో ఉపాధి లేక ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయ సిబ్బందికి ఆపత్కాల బృతి, ఉచిత బియ్యం అందజేస్తూ సీఎం కేసీఆర్ అండగా నిలుస్తున్నారని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు అన్నారు. కరోనాతో మృతిచెందిన ట్రస్మా జిల్లా ప్రధాన కార్యదర్శి సీమెచ్ రవీందర్రావు, తూడి శ్రీనివాస్ రెడ్డి స్మారకార్థం శ్రీరాంపూర్లోని సందీపని ఆడిటోరియంలో శుక్రవారం ప్రైవేట్ పాఠశాలల సిబ్బంది, పేదలకు ఆయన నిత్యావసర సరుకులు, బియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా కరోనాతో ప్రైవేట్ ఉపాధ్యాయులు ఎందరో మృతిచెందారన్నారు. విద్యారంగం చాలా ఇబ్బందులో ఉన్న తరుణంలో ఎలాంటి జీవనోపాధి లేక తల్లడిల్లుతున్న ప్రైవేట్ పాఠశాలల సిబ్బందిని ఆదుకునేందుకు సీఎం కేసీఆర్ ముందుకు వచ్చి అన్ని రాష్ట్రలకు ఆదర్శంగా నిలిచారన్నారు. ఎందరో నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తున్న సంస్థల కరస్పాండెంట్లు కరోనాతో మృతి చెందడం వల్ల వారిపై ఆధారపడ్డ కుటుంబాల్లో ఇబ్బందుల్లో పడుతున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నస్పూర్ చైర్మన్ ఇసంపెల్లి ప్రభాకర్, వైస్ చైర్మన్ తోట శ్రీనివాస్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వంగ తిరుపతి, కౌన్సిలర్లు పూదరి కుమార్, ట్రస్మా జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్, రాష్ట్ర కార్యదర్శి రాజారెడ్డి, మల్లెత్తుల రాజేంద్రపాణి, యెక్కటి రాంరెడ్డి, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రేగల్ల ఉపేందర్, నాయకులు సురేందర్రావు, విష్ణువర్ధన్రెడ్డి, ఊట్ల సత్యనారాయణ, రాధాకృష్ణ, శ్రీనివాస్, ఇబ్రహీం, కమలాకర్రావు, సిద్ధం శంకర్, బండి తిరుపతి పాల్గొన్నారు.
పీహెచ్సీ పరిశీలన..
హాజీపూర్, జూన్ 4 : హాజీపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కొవిడ్ నిర్ధారణ పరీక్షల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే వెంట స్థానిక నాయకులు ఉన్నారు
ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ల అందజేత..
లక్షెట్టిపేట రూరల్, జూన్ 4 : అమెరికాలోని గ్రేటర్ అట్లంటా తెలంగాణ సొసైటీ వారు విరాళంగా ఇచ్చిన రెండు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను పట్టణంలోని మున్సిపల్ ఆవరణలో శుక్రవారం ప్రభుత్వ దవాఖాన సూపరింటెండెంట్ కుమార స్వామికి ఎమ్మెల్యే దివాకర్రావు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమానికి తెలంగాణ సర్కారు నిరంతరం కృషిచేస్తున్నదన్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో అజాగ్రత్తతో ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని సూచించారు. వైరస్ కట్టడికి ప్రభుత్వం విధించిన లాక్డౌన్ వల్ల కేసులు తగ్గుముఖం పట్టాయన్నారు. అలాగే ప్రభుత్వం ఆరోగ్య కార్యకర్తల ద్వారా ఇంటింటా నిర్వహిస్తున్న జ్వర సర్వే సత్ఫలితాలిస్తున్నదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ పొడేటి శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేశ్, ప్రభుత్వ వైద్యులు పవన్ కుమార్, ఆకుల శ్రీనివాస్, జిల్లా వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ నాయకులు చెట్ల రమేశ్, జన రూపం పత్రిక ఎడిటర్ వొజ్జల రాజమౌళి, టీఆర్ఎస్ నాయకులు గరిసే రవీందర్, పాదం మహేందర్, పెట్టెం తిరుపతి, మోటపలుకుల శ్రీనివాస్, కట్ల శంకర్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ గడికొప్పుల కిరణ్, ఆర్యవైశ్య సంఘం నాయకులు కటకం రమేశ్, నలమాస్ శ్రీనివాస్, గడ్డం వికాస్, కాసం రాజయ్య, పాత్రికేయులు పాల్గొన్నారు.