నల్లగొండ రూరల్, నవంబర్ 3 : టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి అన్నారు. ఎన్డీసీఎంస్ ఆధ్వర్యంలో జీకే అన్నారం, నర్సప్పగూడెం, మేళ్లదుప్పలపల్లి, ఐకేపీ ఆధ్వర్యంలో ఎస్ఎల్బీసీలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను బుధవారం ఎన్డీసీఎంఎస్ చైర్మన్ వట్టె జానయ్య యాదవ్తో కలిసి ఆయన ప్రారంభించి మాట్లాడారు. అధికారులు, హమాలీలు సమన్వయంతో కొనుగోళ్లు సజావుగా సాగేలా చూడాలన్నారు. ఎన్డీసీఎంఎస్ చైర్మన్ వట్టె జానయ్య యాదవ్ మాట్లాడుతూ తమ సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలో ఐదు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో ఎంపీపీ సుమన్, మార్కెట్ కమిటీ చైర్మన్ బొర్ర సుధాకర్, వైస్ చైర్మన్ మధుసూదన్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ ఆలకుంట్ల నాగరత్నం రాజు, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు దేప వెంకట్రెడ్డి, బకరం వెంకన్న, గాదె రాంరెడ్డి, సర్పంచులు పందిరి సరిత, మనిమద్దె పద్మావతి, జాన్రెడ్డి, బడుపుల శంకర్, తవిట కృష్ణ, బీరం గోపాల్రెడ్డి, రాజుపేట మల్లేశ్, విమలమ్మ, డీపీఎం రామలింగయ్య, ఏపీఎం సైదులు , ఏఓ సుమన్ రామన్, మురళి, వీబీకే అనురాధ, లక్ష్మమ్మ పాల్గొన్నారు.
నార్కట్పల్లిలో..
నార్కట్పల్లి : మండలంలోని మాండ్ర, తిరుమలగిరి, జువ్విగూడెం, షాపల్లి, నక్కలపల్లి గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమల్లో జువ్విగూడెం గ్రామాభివృద్ధి కమిటీ చైర్మన్ బసిరెడ్డి ప్రభాకర్రెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
కట్టంగూర్లో..
కట్టంగూర్ : మండలంలోని ఈదులూరు, పామనుగుండ్ల, కట్టంగూర్లో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్య కొనుగోలు కేంద్రాలను జడ్పీటీసీ తరాల బలరాములు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు అభ్యున్నతే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందన్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ నూక సైదులు, వైస్ ఎంపీపీ గడుసు కోటిరెడ్డి, వైస్ చైర్మన్ కుందారపు వెంకట్రెడ్డి, సర్పంచులు వడ్డె సైదిరెడ్డి, పిన్నపురెడ్డి నర్సిరెడ్డి, ఎంపీటీసీ పాలడగు హరికృష్ణ, ఉప సర్పంచులు అంతటి శ్రీను, చెరుకు నర్సింహ, రెడ్డిపల్లి మన్మోహన్, గాజుల బుచ్చమ్మ, నకిరేకంటి నర్సింహ, నగేశ్, బొల్లెద్దు యాదయ్య, పెద్ది ప్రవీణ్, చంద్రయ్య, సైదమ్మ పాల్గొన్నారు.