వేడుకలకు సిద్ధమైన ప్రజలు
ఇంటింటా సందడి
లక్ష్మీ పూజలు, కేదారీశ్వర వ్రతాలు
కొనుగోళ్లు, ఆర్డర్లతో మార్కెట్లో సందడి
పెద్ద సంఖ్యలో పటాకుల దుకాణాలు
మంచిర్యాల (నమస్తే తెలంగాణ)/ మంచిర్యాల ఏసీసీ, నవంబర్ 3 : కొవిడ్ సెకండ్ వేవ్తో గతేడాది జనమంతా దీపావళి వేడుకలకు దూరంగా ఉన్నారు. దీంతో దుకాణాలన్నీ బోసిపోయాయి. కరోనా ఉధృతి మెల్లమెల్లగా తగ్గుముఖం పట్టడంతో ఈ యేడాది మార్కెట్లన్నీ కళకళలాడుతున్నాయి. పెద్ద ఎత్తున పటాకుల దుకాణాలు వెలిశాయి. కొనుగోళ్లు, అమ్మకాలతో బుధవారం కిటకిటలాడాయి. పటాకుల షాపుల్లో ధరలపై ఆరాతీయడం, పూల దుకాణాల వద్ద ఆర్డర్లు, ప్రమిదలు, పూజా సామగ్రి, కొత్త బట్టల కొనుగోళ్లతో మార్కెట్ రద్దీగా కనిపించింది. పట్టణ, పల్లె ప్రజలతో నిండుగా ఉండడంతో దుకాణాదారులు ఆనందంలో ఉన్నారు.
నేడు దీపావళి..
దీపావళి.. ఇది దీపాల పండుగ. ఆనందం.. విజ యం.. సామరస్యాన్ని గుర్తు చేసే పండుగ. జాతి, కుల, మత, వర్గ విభేదాలను విస్మరించి సమైక్యం గా ఆనందోత్సాహాలతో జరుపుకునే వేడుక. జగతిని జాగృతం చేసే చైతన్య దీప్తుల శోభావళి. రకరకాల పూల అలంకరణలో.. విద్యుత్ దీప కాంతు ల్లో ప్రతి ఇల్లూ శోభాయమానంగా వెలిగిపోతుం ది. మన దేశంలో దీపావళి పండుగకు ఎంతో విశిష్టత ఉంది. ఈ పండుగ గురించి ఒక్కో ప్రాంతం లో ఒక్కో రకంగా ఇతిహాసాలు, ఆసక్తికరమైన కా రణాలు, రహస్యాలు, కథలు, నమ్మకాలు ఉన్నా యి. సత్యభామ నరకాసురున్ని సంహరించిందని, నరకాచతుర్దశి నరకాసురుని పీడ విరగడైందన్న సంతోషంతో ఆ మరుసటి రోజు ప్రజలు సంబురాలు జరుపుకున్నారని పురాణాలు చెబుతున్నా యి. రావణుడిని సంహరించి శ్రీరాముడు సతీసమేతంగా అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు కూడా ప్రజలు ఆనందోత్సాహాల మధ్య దీపావళిని జరుపుకున్నారని రామాయణం చెబుతున్నది. చీకటిని పారదోలుతూ వెలుగులు తెచ్చే పండుగగా, విజయానికి ప్రతీకగా దీపావళి పండుగను జరుపుకుంటారు. దీపావళి రోజు అమావాస్య కావడంతో చీకటిని పారదోలుతూ ఏటా దీపాలతో తోరణాలు వె లిగిస్తారు. పటాకులు కాల్చి వేడుక చేసుకుంటారు. కొత్త బట్టలు ధరించి పిండి వంటలు ఆరగిస్తారు. ఈ పండుగ యేటా ఆశ్వయుజ అమావాస్య రోజు న వస్తుంది. దీపావళి పండుగకు ముందు రోజు ఆశ్వయుజ బహుళ చతుర్దశి. దీనినే నరక చతుర్దశిగా నిర్వహిస్తారు. దీపావళి రాత్రి లక్ష్మీదేవి ప్రజల ఇళ్లను సందర్శించి.. వారిని ఆశీర్వదిస్తుందని పూ ర్వీకుల నమ్మకం. అందుకే చాలా మంది లక్ష్మీపూజల కోసం ఇంటిలోని పాత వస్తువులను విస్మరిస్తారు. ఇళ్లంతా శుభ్రం చేసుకుంటారు. అద్భుతమైన లైట్లు, పూలు, దీపాలతో తమ ఇండ్లను అం దంగా అలంకరిస్తారు. ధనలక్ష్మి పుట్టిన రోజు సం దర్భంగా దీపావళి పండుగను జరుపుకోవాలని హిందువులు నమ్ముతారు. దీపావళి రోజున లక్ష్మీదేవికి పూజలు చేస్తారు. కొంతమంది కేదారేశ్వర వ్రతాలు నోముకుంటారు. దీపావళి పండుగ నేపథ్యంలో లక్ష్మీపూజలు, కేదారేశ్వర వ్రతాలు ఆచరించేందుకు ఇండ్లు, వ్యాపార సముదాయలను సిద్ధం చేసుకుంటున్నారు. రంగురంగుల పూలు, విద్యుద్దీపాలతో అందంగా అలంకరించుకుంటున్నారు.
నేడు నరక చతుర్దశి..
దీపం.. చీకటి నుంచి వెలుగుకు దారి చూపు తుంది. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా ప్రజలు దీపావళి పండుగను జరుపు కుంటారు. నవంబర్ 4న చతుర్దశి ఉదయం 4.24 గంటలకు ప్రారంభం అవుతుంది. తర్వాత అమావాస్య ప్రారంభమై, నవంబర్ 5న 3.51 గంటల వరకు ఉంటుంది. అందుకే ఈ యేడాది గురువారమే నరక చతుర్దశి, దీపావళి, లక్ష్మీపూజలు జరుపుకోవాలని శాస్త్రం చెబుతున్నది. లక్ష్మిని పూజించ డంతో ఐష్టెశ్వర్యాలు కలుగుతాయి. ప్రజలంతా సుఖసంతోషాలతో ఉంటారు.