వందశాతం వ్యాక్సిన్ అందించాలి
వీడియో కాన్ఫరెన్స్లో మంత్రులు హరీశ్రావు, కేటీఆర్, సబితాఇంద్రారెడ్డి
మెదక్ /సంగారెడ్డి కలెక్టరేట్/సిద్దిపేట అర్బన్, డిసెంబర్ 1 : ప్రజలను చైతన్య పరుస్తూ వందశాతం వ్యాక్సిన్ అందించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డితో కలిసి బుధవారం బీఆర్కే భవన్ నుంచి జిల్లా కలెక్టర్లు, వైద్య, విద్య, పంచాయతీ, మున్సిపల్ శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒమిక్రాన్ వేరియంట్ బారిన పడకుండా ఉండేందుకు రాష్ట్రంలోని అర్హులైన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకునే విధంగా అన్ని శాఖల సమన్వయంతో ఈ నెల 31తేదీ నాటికి వందశాతం వ్యాక్సినేషన్ జరుగాలని అన్నారు. మొదటి రెండు డోస్ల అనుభవాలు, ఎదుర్కొన్న సవాళ్లను దృష్టిలో పెట్టుకొని థర్డ్వేవ్కు సన్నద్ధం కావాలని మంత్రి కేటీఆర్ అన్నారు. సోషల్ మీడియాలో వస్తున్న అపోహాలను నమ్మొద్దని, అలాంటి వాటిపై కలెక్టర్లు స్పందించాలన్నారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ విద్యాలయాలు, వసతి గృహాల్లోని విద్యార్థులకు వ్యాక్సిన్ అందించాలని, జిల్లా వైద్య శాఖాధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ మాట్లాడుతూ ప్రతి శాఖలో పనిచేసే ఉద్యోగులు తప్పనిసరిగా వ్యాక్సి న్ తీసుకోవాలని అన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో మెదక్ అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్, జడ్పీ సీఈవో శైలేశ్, డీఎంహెచ్వో వెంకటేశ్వర్రావు, డీఆర్డీవో శ్రీనివాస్, డీఈవో రమేశ్కుమార్, సంగారెడ్డి జిల్లా నుంచి కలెక్టర్ హనుమంతరావు, అదనపు కలెక్టర్ రాజర్షి షా, జడ్పీ సీఈవో ఎల్ల య్య, వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ గాయ త్రీదేవి పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా నుంచి అడిష నల్ కలెక్టర్ ముజామ్మిల్ఖాన్, జిల్లా వైద్యాధికారి మనోహర్ అధికారులు పాల్గొన్నారు.