అంబర్పేట : రాబోవు దసరా సమ్మేళనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ వివిధ విభాగాల అధికారులను ఆదేశించారు. అంబర్పేట దేవస్థాన సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించే బతుకమ్మ, దాండియా, దసరా సమ్మేళనం పై స్థానిక మున్సిపల్ మైదానం ఇండోర్ స్టేడియంలో కార్పొరేటర్ బి.పద్మావెంకటరెడ్డి, ఇ.విజయ్కుమార్గౌడ్ లతో పాటు అన్ని ప్రభుత్వ విభాగాల అధికారులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దసరా పండుగ రోజు మున్సిపల్ గ్రౌండ్లో ఏర్పాటు చేసే దసరా సమ్మేళనానికి కావాల్సిన ఏర్పాట్లను వెంటనే పూర్తి చేయాలని చెప్పారు. జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య , ఇంజినీరింగ్ విభాగాలు, ఆర్ అండ్ బీ అధికారులు, జలమండలి, విద్యుత్, పోలీసు అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. బతుకమ్మకుంట వద్ద నిర్వహించే సద్దుల బతుకమ్మకు కూడా కావాల్సిన ఏర్పాట్లు చేయాలని చెప్పారు.
శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా అంబర్పేట పోలీసులు చూడాలని, ట్రాఫిక్ సమస్యలు రాకుండా కాచిగూడ ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు. కొవిడ్ నిబంధనలు పాటించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్ శ్రీనివాస్, డీఐ శ్రీధర్, ఎస్సై సురేష్, మాజీ కార్పొరేటర్ పి.జ్ఞానేశ్వర్గౌడ్, బి.వెంకటరెడ్డి, దేవస్థాన సేవా సమితి అధ్యక్షుడు జె.సత్తిబాబుగౌడ్, ఉపాధ్యక్షుడు పి.చంద్రశేఖర్గౌడ్, ప్రధాన కార్యదర్శి ఎం.శ్రీరాములుముదిరాజ్, కార్యదర్శి చెంగలి సుధాకర్, కార్యనిర్వాహక కార్యదర్శి గడ్డం శ్రీధర్గౌడ్, కోశాధికారి వి.మహేందర్రెడ్డి, సభ్యులు బి. రఘుచారి, వై.సందీప్గౌడ్, మిర్యాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.